News February 25, 2025
HYD: ప్రతినిధులే కబ్జాలు చేస్తున్నారు: హైడ్రాకు ఫిర్యాదు

పార్కులు, రహదారులు, ప్రజావసరాలకు ఉద్దేశించి పలు లే ఔట్లలో కేటాయించిన స్థలాలను అక్కడి కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులే కబ్జా చేస్తున్నారని పలువురు పలువురు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హైడ్రా ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో హైడ్రా ఆడిషనల్ డైరెక్టర్ ఫైర్ పాపయ్య ఫిర్యాదులు స్వీకరించారు. కాలనీ రహదారులను కూడా వదలకుండా ముందుకు జరిగి ప్రహరీలు నిర్మిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Similar News
News January 16, 2026
ప్రాధాన్యం సంతరించుకున్న మోదీ WB టూర్

PMమోదీ రేపు, ఎల్లుండి WBలో చేపట్టనున్న పర్యటన రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. APRలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ₹3,250CR ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. ఇతర రాష్ట్రాలకు 7 అమృత్ భారత్ రైళ్లను, తొలి వందే భారత్ స్లీపర్ ట్రైన్ను ప్రారంభిస్తారు. సింగూర్లో ₹830CR అభివృద్ధి పనులకు శ్రీకారం, బాలాగఢ్లో 900 ఎకరాల్లో కార్గో హ్యాండ్లింగ్ టెర్మినల్కు శంకుస్థాపన చేస్తారు.
News January 16, 2026
విశాఖలో భూ లిటిగేషన్లతో తలపోటు (1/2)

విశాఖలో భూ లిటిగేషన్లు మరోసారి తలపోటుగా మారాయి. ప్రభుత్వ, ప్రైవేట్ భూములపై అక్రమార్కులు తిష్ట వేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా భీమిలి, పెందుర్తి నియోజకవర్గాల్లో వివాదాలు తెరపైకి రావడం యంత్రాంగానికి సవాల్గా మారింది. శివారు ప్రాంతాల్లో భూముల ధరలు అమాంతం పెరగడంతో యాజమాన్య హక్కులపై సవాళ్లు పెరుగుతున్నాయి.
News January 16, 2026
విశాఖలో భూ లిటిగేషన్లతో తలపోటు (2/2)

విశాఖలో భూ లిటిగేషన్లు ఎంతలా ఉన్నాయంటే.. ఇటీవల పెందుర్తి (M) చింతగట్లలో ప్రభుత్వ భూమి ఆక్రమణల తొలగింపునకు వెళ్లిన రెవెన్యూ సిబ్బందిపై రాళ్లదాడికి తెగబడ్డారు. అదేవిధంగా గండిగుండంలో భూ వివాదం చెలరేగింది. VMRDA చేపడుతున్న అడవివరం–సొంట్యం రహదారి విస్తరణతో ల్యాండ్ విలువ రూ.కోట్లు పలుకుతోంది. ఈ నేపథ్యంలో అక్రమాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నా.. లిటిగేషన్ బ్యాచ్ల ప్రయత్నాలు ఆందోళన కలిగిస్తున్నాయి.


