News February 25, 2025

HYD: ప్రతినిధులే కబ్జాలు చేస్తున్నారు: హైడ్రాకు ఫిర్యాదు

image

పార్కులు, రహదారులు, ప్రజావసరాలకు ఉద్దేశించి పలు లే ఔట్లలో కేటాయించిన స్థలాలను అక్కడి కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులే కబ్జా చేస్తున్నారని పలువురు పలువురు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హైడ్రా ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో హైడ్రా ఆడిషనల్ డైరెక్టర్ ఫైర్ పాపయ్య ఫిర్యాదులు స్వీకరించారు. కాలనీ రహదారులను కూడా వదలకుండా ముందుకు జరిగి ప్రహరీలు నిర్మిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Similar News

News September 19, 2025

టుడే టాప్ స్టోరీస్

image

* జీఎస్టీ సంస్కరణలతో పేదల జీవితాలు మారతాయి: CM చంద్రబాబు
* ఢిల్లీకి సీఎం రేవంత్.. పెట్టుబడులపై కంపెనీల ప్రతినిధులతో రేపు భేటీ
* ప్రజల గొంతు వినాలని ప్రభుత్వానికి లేదు: జగన్
* నకిలీ ఓట్ల వెనుక ఎవరున్నారో తెలియాలి: రాహుల్ గాంధీ
* ఓట్ల చోరీ ఆరోపణలు చేయడం రాహుల్‌కు అలవాటుగా మారింది: BJP
* OCT 1 నుంచి అమల్లోకి ఆన్‌లైన్‌ గేమింగ్‌ చట్టం: కేంద్రం
* లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

News September 19, 2025

బగ్రామ్ ఎయిర్‌బేస్‌ స్వాధీనం చేసుకోవాలి: ట్రంప్

image

అఫ్గానిస్థాన్‌లోని బగ్రామ్ ఎయిర్‌బేస్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. గత ప్రెసిడెంట్ జోబైడెన్ ఎలాంటి ప్రయోజనం లేకుండానే ఆ స్థావరాన్ని వదిలేశారని విమర్శించారు. చైనా అణ్వాయుధ ఉత్పత్తి కేంద్రాల నుంచి కేవలం గంటలోనే ఈ ఎయిర్‌బేస్‌కు చేరుకోవచ్చని తెలిపారు. భవిష్యత్తులో చైనా ఈ స్థావరాన్ని చేజిక్కించుకుంటుందన్న అనుమానంతోనే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

News September 19, 2025

కరీంనగర్: చెత్త వేయకుండా ఇనుప జాలి ఏర్పాటు

image

కరీంనగర్‌లోని అంబేడ్కర్ స్టేడియం, బస్టాండ్ వెనుక రోడ్డులో ప్రజలు చెత్త వేయకుండా మున్సిపల్ అధికారులు ఇనుప జాలిని ఏర్పాటు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయవద్దని అధికారులు పదేపదే సూచించినా ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో ఈ చర్యలు తీసుకున్నారు. నగర పరిశుభ్రతను కాపాడటానికి అందరూ సహకరించాలని అధికారులు కోరారు.