News February 25, 2025

కరీంనగర్: ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు

image

ఉమ్మడి KNR, MDK, NZB, ADB జిల్లాలో ఈ నెల 27న జరిగే పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సాధారణ సెలవు ఇస్తున్నట్లు కలెక్టర్ పమేలాసత్పతి ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు.

Similar News

News April 23, 2025

చొప్పదండి: మహిళలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి: కలెక్టర్

image

ఇల్లాలు బాగుంటేనే ఇల్లు బాగుంటుందని, స్త్రీలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. చొప్పదండిలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన పోషణ పక్షం కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని, గర్భిణీలు పోషకాహారం తీసుకోవాలని కోరారు. ఆరోగ్య మహిళా కార్యక్రమంలో టెస్టులు చేయించుకోవాలని.. తద్వారా రుగ్మతలు నివారించుకోవచ్చన్నారు.

News April 23, 2025

కరీంనగర్ జిల్లాలో మండుతున్న ఎండలు

image

కరీంనగర్ జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ఉదయం 10 గంటల తరువాత ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. గడచిన 24 గంటల్లో అత్యధికంగా గంగాధర, మానకొండూర్ మండలాల్లో 44.0°C నమోదు కాగా, కొత్తపల్లి, చొప్పదండి 43.8, కరీంనగర్, జమ్మికుంట 43.7, శంకరపట్నం 43.6, రామడుగు, ఇల్లందకుంట, తిమ్మాపూర్ 43.5, వీణవంక 43.4, గన్నేరువరం, కరీంనగర్ రూరల్ 43.3, చిగురుమామిడి 43.1, సైదాపూర్ 42.8, హుజూరాబాద్ 42.2°C గా నమోదైంది.

News April 23, 2025

KNR: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

తిమ్మాపూర్‌లోని SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో మే 5 నుంచి మగ్గం వర్క్స్, మే 8 నుంచి టైలరింగ్ పై ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ డీ. సంపత్ తెలిపారు. ఉమ్మడి KNR జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలు 18 నుంచి 45 సంవత్సరాల వారు అర్హులు అవుతారని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు మే 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ శిక్షణ 31 రోజులు ఉంటుందని అన్నారు.

error: Content is protected !!