News February 25, 2025
పిఠాపురం: వైరల్ అవుతున్న పవన్ AI ఫొటో

జిల్లాలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ AI ఫొటో వైరల్గా మారింది. జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి పట్టభద్రుల MLC కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్కి నిన్న మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆయన ఓ వీడియో ద్వారా తెలిపారు. అయితే ఆయన ఓటును అభ్యర్థిస్తూ AIతో చేసిన ఫొటోను కూటమి నేతలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్గా మారింది.
Similar News
News January 16, 2026
కొత్తకొండ వీరభద్ర స్వామి జాతరలో ఉద్రిక్తత!

భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్ర స్వామి జాతరలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. క్యూలైన్లో ఇద్దరు భక్తుల మధ్య తోపులాట జరిగింది. దీంతో అడ్డుకోబోయిన పోలీసులపై యువకుడు దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం. పోలీసులు, భక్తుల మధ్య వాగ్వాదం జరగడంతో యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News January 15, 2026
కేటీఆర్ కరీంనగర్ పర్యటన వాయిదా

కరీంనగర్లో ఈ నెల 19న జరగాల్సిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన వాయిదా పడింది. ఉమ్మడి జిల్లా నూతన సర్పంచుల అభినందన సభకు కేటీఆర్ హాజరుకావాల్సి ఉండగా.. అదే రోజు నుంచి ప్రభుత్వం సర్పంచులకు శిక్షణ తరగతులు ప్రకటించింది. ఈ నేపథ్యంలో సమావేశాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జి.వి.రామకృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. సభ నిర్వహణ తేదీని త్వరలోనే ప్రకటిస్తామన్నారు.
News January 15, 2026
కామారెడ్డి: రేపే అన్ని వివరాలతో కూడిన తుది ఓటర్ల జాబితా

కామారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డి మున్సిపాలిటీల పూర్తిస్థాయి తుది ఓటర్ల జాబితాను(ఫోటోలతో కూడిన) అన్ని వివరాలతో రేపు అధికారులు ప్రకటించనున్నారు. మొత్తం 92 వార్డుల తుది జాబితాలో పురుషులు, మహిళలు, ఇతరుల వారీగా ఓటర్ల వివరాలు వెల్లడించనున్నారు. ఇప్పటికే బూత్ల వివరాలు, మున్సిపాలిటీల వారీగా రిజర్వేషన్లు ప్రకటించగా ఏ వార్డు కు ఏ రిజర్వేషన్ వస్తుందోనని ఆశావాహులు ఎదురుచూస్తున్నారు.


