News February 25, 2025

టీసీ వరుణ్‌కు కీలక బాధ్యతలు

image

జనసేన ఆవిర్భావ వేడుకలకు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఆ పార్టీ సమన్వయకర్తలను నియమించింది. అనంతపురం పార్లమెంట్‌కు టీసీ వరుణ్, హిందూపురం పార్లమెంట్‌కు చిలకం మధుసూదన్ రెడ్డి నియమితులయ్యారు. వీరు నియోజకవర్గాల నేతలతో సమన్వయం చేసుకుని మార్చి 14న పిఠాపురంలో జరగనున్న ఆవిర్భావ వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది.

Similar News

News October 31, 2025

పోలీసు అమరవీరులకు జోహార్లు

image

విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరవీరులకు జిల్లా ఎస్పీ జగదీశ్ జోహార్లు తెలిపారు. పోలీసుల అమరవీరుల వారోత్సవాల ముగింపు రోజున శుక్రవారం అనంతపురంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఎస్పీ జగదీష్, ఇతర పోలీస్ అధికారులు అమర వీరులకు నివాళులర్పించారు. వారోత్సవాల్లో భాగంగా జిల్లావ్యాప్తంగా ఓపెన్ హౌస్, రక్తదాన శిబిరాలు, వ్యాస రచన పోటీలు, ఉచిత వైద్య శిబిరాలు వంటి కార్యక్రమాలను నిర్వహించినట్లు SP తెలిపారు.

News October 30, 2025

మహిళ సూసైడ్ అటెంప్ట్

image

గుత్తి మండలం అబ్బేదొడ్డినికి చెందిన శిరీష పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించి, 48 గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉండాలని శిరీషకు సూచించారు.

News October 29, 2025

అనంత జిల్లాలో 80.4 మి.మీ వర్షపాతం నమోదు

image

అనంత జిల్లాలో కురుస్తున్న వర్షాలకు 80.4 మి.మీ కురిసింది. అత్యధికంగా తాడిపత్రి మండలంలో 10.8 మి.మీ, ఎల్లనూరు 10.2, పుట్లూరు 9.8, గుత్తి 6.8, పెద్దవడుగూరు 6.0, యాడికి 5.0, నార్పల 4.8, పెద్దపప్పూరు 4.4, గార్లదిన్నె 4.0, BKS 3.0, గుంతకల్ 2.4, శింగనమల 2.4, కూడేరు 2.0, ఆత్మకూరు 2.0, అనంతపురం అర్బన్ 2.0, పామిడి 1.4, కళ్యాణదుర్గం 1.2, రాయదుర్గం మండలంలో 1.0 కురిసింది. పలు ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి.