News February 25, 2025

గుంటూరులో లారీ ఢీకొని ఇద్దరు మృతి

image

గోరంట్ల గ్రామ పంచాయతీ పరిధిలో లారీ ఢీ కొని ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. అమరావతి నుంచి గుంటూరు నగరంలోకి వస్తున్న లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోందియ. స్థానికుల సమాచారంతో నల్లపాడు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుల్లో ఒక మహిళ, పురుషుడు ఉన్నారు.

Similar News

News September 16, 2025

అనకాపల్లి: ‘మత్స్యకారులపై పోలీసులు ఆంక్షలు తగదు’

image

బల్క్ డ్రగ్ పార్క్‌కు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తున్న మత్స్యకారులపై పోలీసులు ఆంక్షలు విధించడం తగదని సీపీఎం జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు అన్నారు. సోమవారం అనకాపల్లిలో మాట్లాడుతూ.. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సీపీఎం జిల్లా నేత అప్పలరాజులు గృహ నిర్బంధం విధించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పేర్కొన్నారు. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేస్తే సముద్రంలో మత్స్య సంపద నాశనం అవుతుందన్నారు.

News September 16, 2025

విజయవాడ: ఉప్మా దోశ విషయంలో దాడి.. నిందితుడు అరెస్ట్

image

విజయవాడ శివారు జక్కంపూడిలోని ఓ హోటల్‌లో ఉప్మా దోశ ఆర్డర్ విషయంలో ఆదివారం గొడవ జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హోటల్ సప్లయర్ పోలిశెట్టి రాజు కస్టమర్ కరిముల్లాపై చాకుతో దాడి చేసి గాయపరిచాడు. ఈ ఘటనపై కేసు నమోదు అయినట్లు కొత్తపేట సీఐ కొండలరావు తెలిపారు. రాజుని అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.

News September 16, 2025

గరుగుబిల్లి: రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్ ఆర్మీ జవాన్ మృతి

image

గరుగుబిల్లి మండలం నందివానవలస కోళ్లు ఫారం వద్ద సోమవారం రాత్రి జరిగిన ప్రమాదంలో గిజబ గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ జవాన్ మరాడన ఆదినారాయణ మృతి చెందాడు. ఖడ్గవలస నుంచి రాత్రి 10 గంటల సమయంలో స్వగ్రామం గిజబకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఓ వాహనం ఢీకొనడంతో ఆదినారాయణ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై ఎస్‌ఐ ఫక్రుద్దీన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.