News February 25, 2025

పెదమేరంగిలో ఏనుగుల గుంపు బీభత్సం

image

జియ్యమ్మవలస మండలం పెదమేరంగిలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. మంగళవారం తెల్లవారుజామున ఏనుగుల గుంపు సాయి గాయత్రి మోడరన్ రైస్ మిల్ షట్టర్లను విరగగొట్టి లోపలకి చొరబడి ధాన్యం, బియ్యం నిల్వలను చెల్లాచెదురుగా చేశాయి. నెల రోజుల్లో 2 సార్లు ఇదే మిల్‌పై దాడి చేయడంతో సుమారు రూ.2 లక్షల వరకు ఆస్తి నష్టం వచ్చిందని బాధితులు వాపోతున్నారు.

Similar News

News January 7, 2026

ఏలూరు: నిర్లక్ష్యం ఖరీదు.. రూ.900 కోట్లు!

image

పోలవరం ప్రాజెక్టులో ఎగువ కాపర్ డ్యామ్‌ నిర్మాణ సమయంలో 2019 నాటికి ఇరువైపులా ఖాళీలు వదిలేశారు. ఖాళీల గుండా 2020లో వచ్చిన వరదకి డయాఫ్రం వాల్‌ పూర్తిగా దెబ్బతింది. దీనిపై గత, ప్రస్తుత ప్రభుత్వాలు పరస్పర విమర్శలు గుప్పించుకున్నాయి. పాలకుల నిర్లక్ష్యం ఖజానాకు భారీగా చిల్లులు పెట్టింది. దెబ్బతిన్న వాల్‌ స్థానంలో కొత్త నిర్మాణం చేపట్టేందుకు రూ.900 కోట్లు అదనంగా వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

News January 7, 2026

భార్యకు వంట రాదని విడాకులా? భర్తపై HC అసహనం

image

TG: భార్యకు వంట రాదంటూ భర్త విడాకులు కోరడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కొన్నేళ్లుగా భార్య నుంచి విడిగా ఉంటున్న వ్యక్తి విడాకులకు అప్లై చేశారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన భార్య పనివేళల దృష్ట్యా వంట చేసేందుకు ఆస్కారం ఉండకపోవచ్చని విచారణ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. తన తల్లి పనులకు సహకరించడం లేదంటూ భార్య క్రూరత్వానికి పాల్పడిందనే అతడి వాదన కూడా సరైంది కాదంటూ విడాకుల అప్పీల్‌ను కొట్టేసింది.

News January 7, 2026

నెల్లూరు జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు

image

వేరుశనగ, నిమ్మ పంటలకు అనుగుణంగా MSME పార్కుల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. నెల్లూరు జడ్పీలో మంగళవారం సమావేశం జరిగింది. ఎలాంటి గ్యారంటీలు లేకుండా MSMEలకు రుణాలు ఇవ్వడం లేదని చర్చ జరిగింది. MSME రుణాల మంజూరుకు మార్జిన్ మనీ ఇస్తామని.. రుణాలు త్వరగా ఇవ్వాలని ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీద మస్తాన్ రావు కోరారు.