News February 25, 2025

గద్వాల: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురి మృతి

image

ఉమ్మడి MBNR జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు చనిపోయారు. వివరాలిలా.. కొత్తకోటకు చెందిన చరణ్‌రెడ్డి, అనిల్ HYDకి వెళ్తూ బైక్‌ అదుపు తప్పి మృతిచెందారు. కొత్తపల్లి మండలం నిడ్జింతతండాలో వాహనం అదుపు తప్పి కిందపడటంతో మద్దూరుకు చెందిన రాములు చనిపోయారు. పెళ్లికి వచ్చిన బంధువులను తీసుకెళ్తుండగా బొలెరో వాహనం వారి బైక్‌ను ఢీకొనడంతో వడ్డేపల్లి మండల వాసి మురళి స్పాట్‌లోనే ప్రాణాలు వదిలాడు.

Similar News

News February 25, 2025

హిందూపురం మాజీ ఎమ్మెల్యే సతీమణి మృతి

image

హిందూపురం దివంగత మాజీ శాసనసభ్యుడు రంగనాయకులు సతీమణి ఈశ్వరమ్మ మంగళవారం ముదిరెడ్డిపల్లిలో మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే వైసీపీ నాయకులు గుడ్డంపల్లి వేణురెడ్డి, కౌన్సిలర్లు మద్దన జయప్ప, మహేశ్ గౌడ్ ఈశ్వరమ్మ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రంగనాయకులకు సహధర్మచారిణిగా అన్ని పార్టీల నాయకులకు ఈశ్వరమ్మ సుపరిచితురాలని పేర్కొన్నారు. కాగా రంగనాయకులు 1985-85, 2004-9 మధ్య MLAగా ఉన్నారు.

News February 25, 2025

రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి

image

రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి చెందిన విషాద ఘటన ఆత్మకూరు మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. రహీంఖాన్‌పేట్‌కు చెందిన గూడూరు చంద్రశేకర్, మత్సగిరి సోమవారం రాత్రి బంధువుల ఇంటి నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా కీసర వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో అన్నదమ్ములు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో గ్రామంలో, వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News February 25, 2025

మిస్ వరల్డ్: IND తరఫున పోటీలో ఈమెనే

image

దేశంలోనే యంగెస్ట్ స్టేట్ అయిన TGలో 72వ మిస్ వరల్డ్ పోటీలు ఈ ఏడాది మే 7-31 మధ్య జరగనున్నాయి. ఈసారి భారత్ తరఫున రాజస్థాన్‌కు చెందిన నందిని గుప్తా పోటీలో ఉండనున్నారు. ఈ 21 ఏళ్ల సుందరి 2023 ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ కాంటెస్ట్‌లో విజేతగా నిలిచారు. బ్యూటీ, స్మార్ట్‌నెస్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆమెను విన్నర్‌గా నిలిపాయి. అదే సంకల్పంతో మిస్ వరల్డ్‌గా నిలుస్తారేమో చూడాలి.

error: Content is protected !!