News March 21, 2024
ఏంటీ లిక్కర్ స్కాం?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32024/1711030069745-normal-WIFI.webp)
ఆప్ సర్కార్ 2021లో కొత్త లిక్కర్ పాలసీ తీసుకొచ్చింది. గతంలో ఢిల్లీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం అమ్మకాలను ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం చేస్తూ ఈ పాలసీని రూపొందించింది. 2022లో వచ్చిన కొత్త చీఫ్ సెక్రటరీ దీనిలో స్కామ్ జరిగిందని భావించి నివేదికను లెఫ్టినెంట్ గవర్నర్కు అందజేశారు. అదే ఏడాది ఆయన CBI విచారణకు ఆదేశించారు. ఇందులో రూ.కోట్ల అవినీతి జరిగిందని భావించి ఈడీ కూడా దర్యాప్తులోకి ఎంట్రీ ఇచ్చింది.
Similar News
News July 8, 2024
డీఎస్సీ పరీక్షల నిర్వహణపై కీలక ప్రకటన
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_92022/1662720894935-normal-WIFI.webp)
TG: డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు ఆందోళన చేస్తుండగా.. పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ స్పందించింది. DSC పరీక్షలు <<13528813>>యథాతథంగా<<>> నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపింది. ఈ నెల 11న సాయంత్రం 5 గంటల నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని వెల్లడించింది.
News July 8, 2024
BREAKING: JL ఫలితాలు విడుదల
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32023/1679908321315-normal-WIFI.webp)
TG: జూనియర్ లెక్చరర్స్ పరీక్షల ఫలితాలను TGPSC విడుదల చేసింది. సబ్జెక్టుల వారీగా జనరల్ ర్యాంకింగ్ లిస్టును వెబ్సైటులో ఉంచింది. 1:2 నిష్పత్తిలో షార్ట్ లిస్ట్ జాబితాను త్వరలోనే వెల్లడిస్తామంది. పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 1:5 నిష్పత్తిలో షార్ట్ లిస్ట్ చేస్తామంది. కాగా గతేడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లోనే జేఎల్ పరీక్షలు జరిగాయి. ఫలితాల కోసం ఇక్కడ <
News July 8, 2024
భూమన, ధర్మారెడ్డిపై టీడీపీ నేతల ఫిర్యాదు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720444976855-normal-WIFI.webp)
AP: టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డిపై సీఎస్ నీరభ్ కుమార్కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. వారిద్దరూ ఆలయ సంప్రదాయాలకు విరుద్ధంగా ప్రవర్తించారని, అక్రమాలు చేశారని చెప్పారు. శ్రీవారిని దర్శించుకునే వ్యాపారవేత్తలతో ధర్మారెడ్డి వైసీపీకి విరాళాలు ఇప్పించారని ఆరోపించారు. ఈ వ్యవహారాలపై సీఐడీ, విజిలెన్స్ శాఖతో విచారణ జరిపించాలని కోరారు.