News February 25, 2025

పరిగిలో రోడ్డు ప్రమాదం (UPDATE)

image

పరిగి శివారులోని HYD బీజాపూర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. రెండు బైకులను కంటైనర్ లారీ ఢీకొనగా ఓ బైక్‌పై ఉన్న శ్రీశైలం (20)అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు పరిగి మండలానికి చెందిన రంగంపల్లి గ్రామానికి చెందిన యువకుడిగా ఎస్‌‌ఐ సంతోష్ కుమార్ తెలిపారు. మరో బైక్‌పై ఉన్న దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నామన్నారు.

Similar News

News November 12, 2025

HYD: డ్రగ్‌ కేసులో నైజీరియన్ డిపోర్టేషన్

image

హైదరాబాద్‌ H-NEW పోలీసులు డ్రగ్‌ కేసులో నైజీరియన్ ఒన్యేవుకూ కెలెచి విక్టర్ను అదుపులోకి తీసుకున్నారు. వీసా గడువు ముగిసినా అక్రమంగా భారత్‌లో ఉండి డ్రగ్‌ సరఫరాలో పాల్గొన్నట్లు విచారణలో తేలింది. FRRO సహకారంతో అతడిని డిపార్ట్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. నైజీరియన్స్ అనుమానాస్పదంగా కనబడితే తప్పకుండా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.

News November 12, 2025

రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి: MHBD కలెక్టర్

image

కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. ఈమేరకు నెల్లికుదురు మండలకేంద్రం, రామన్నగూడెంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోళ్ల కేంద్రాలను వారు సందర్శించారు. అదేవిధంగా మండలంలోని కేజీబీవీ పాఠశాలను కూడా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందుతున్న సౌకర్యాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

News November 12, 2025

ADB: KU పరీక్షల షెడ్యూల్ విడుదల

image

కాకతీయ యూనివర్సిటీ (కేయూ) పరిధిలో బీఏ, బీకాం, బీఎస్సీ సహా ఇతర డిగ్రీ కోర్సుల 1, 3, 5వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 18 నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కట్ల రాజేందర్ తెలిపారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. వివరాలు కేయూ వెబ్‌సైట్‌లో ఉన్నాయన్నారు.