News February 25, 2025

పరిగిలో రోడ్డు ప్రమాదం (UPDATE)

image

పరిగి శివారులోని HYD బీజాపూర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. రెండు బైకులను కంటైనర్ లారీ ఢీకొనగా ఓ బైక్‌పై ఉన్న శ్రీశైలం (20)అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు పరిగి మండలానికి చెందిన రంగంపల్లి గ్రామానికి చెందిన యువకుడిగా ఎస్‌‌ఐ సంతోష్ కుమార్ తెలిపారు. మరో బైక్‌పై ఉన్న దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నామన్నారు.

Similar News

News February 25, 2025

రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి

image

రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి చెందిన విషాద ఘటన ఆత్మకూరు మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. రహీంఖాన్‌పేట్‌కు చెందిన గూడూరు చంద్రశేకర్, మత్సగిరి సోమవారం రాత్రి బంధువుల ఇంటి నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా కీసర వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో అన్నదమ్ములు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో గ్రామంలో, వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News February 25, 2025

మిస్ వరల్డ్: IND తరఫున పోటీలో ఈమెనే

image

దేశంలోనే యంగెస్ట్ స్టేట్ అయిన TGలో 72వ మిస్ వరల్డ్ పోటీలు ఈ ఏడాది మే 7-31 మధ్య జరగనున్నాయి. ఈసారి భారత్ తరఫున రాజస్థాన్‌కు చెందిన నందిని గుప్తా పోటీలో ఉండనున్నారు. ఈ 21 ఏళ్ల సుందరి 2023 ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ కాంటెస్ట్‌లో విజేతగా నిలిచారు. బ్యూటీ, స్మార్ట్‌నెస్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆమెను విన్నర్‌గా నిలిపాయి. అదే సంకల్పంతో మిస్ వరల్డ్‌గా నిలుస్తారేమో చూడాలి.

News February 25, 2025

ఈ అన్‌హెల్తీ ఫుడ్స్‌కు దూరంగా ఉండండి: వైద్యులు

image

షుగర్, ఊబకాయం వంటి రోగాలు దరిచేరవద్దంటే కొన్ని అన్‌హెల్తీ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ‘వైట్ బ్రెడ్, బియ్యం, పాస్తా వంటి పిండి పదార్థాల వాడకం తగ్గించాలి. కూల్ డ్రింక్స్, ప్యాక్డ్ ఫ్రూట్ జ్యూస్, ఎనర్జీ డ్రింక్స్ జోలికి వెళ్లొద్దు. స్వీట్లు, కేక్, చాక్లెట్లు, ఐస్‌క్రీమ్స్‌తో పాటు మద్యానికి దూరంగా ఉండాలి. చిరుతిళ్లు, చిప్స్, ప్రాసెస్డ్ ఫుడ్, ఆయిల్ ఫుడ్స్‌ తినొద్దు’ అని చెప్పారు.

error: Content is protected !!