News February 25, 2025

వరంగల్: స్పెషల్ బస్సుల టికెట్ ఛార్జీలు ఇలా..!

image

మహా శివరాత్రి సందర్భంగా మూడు రోజుల పాటు ఆయా బస్టాండ్ల నుంచి శైవ క్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. వరంగల్ నుంచి ఐనవోలుకు రూ.50, మెట్టుగుట్టకు రూ.50, హనుమకొండ నుంచి వేములవాడకు రూ.210, కాళేశ్వరానికి రూ.250, రామప్పకు రూ.140, పాలకుర్తికి రూ.90, తొర్రూరు నుంచి పాలకుర్తికి రూ.100, మహబూబాబాద్ నుంచి కురవికి రూ.30, జనగామ నుంచి కొమురవెల్లికి రూ.100 టికెట్ ధరలను తీసుకోనున్నారు.

Similar News

News February 25, 2025

రాజీనామా చేసిన నహీద్.. త్వరలో కొత్త పార్టీ!

image

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంలో సలహాదారుడిగా ఉన్న నహీద్ ఇస్లాం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను చీఫ్ అడ్వైజర్ మహమూద్ యూనస్‌కు అందజేశారు. నహీద్ సొంత పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఢాకా యూనివర్సిటీకి చెందిన ఇతడు షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టడంలో కీలకపాత్ర పోషించారు. నహీద్ నాయకత్వంలో విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు.

News February 25, 2025

బండి విజ్ఞతతో మాట్లాడాలి: టీపీసీసీ చీఫ్

image

TG: కాంగ్రెస్ పార్టీని పాకిస్థాన్ టీమ్‌తో పోల్చుతూ కేంద్ర మంత్రి <<15574950>>బండి సంజయ్<<>> చేసిన వ్యాఖ్యలపై TPCC చీఫ్ మహేశ్ కుమార్ స్పందించారు. రాజకీయాలను క్రికెట్‌‌ను ముడిపెట్టకుండా విజ్ఞతతో మాట్లాడాలని హితవు పలికారు. రాష్ట్ర రాజకీయాలు తెలియకుండా మాట్లాడొద్దని మండిపడ్డారు. గత పదేళ్లలో BRS చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే సంక్షేమానికి పెద్ద పీట వేశామని తెలిపారు.

News February 25, 2025

అభిమానులకు ‘సంక్రాంతికి వస్తున్నాం’ మేకర్స్ సర్‌ప్రైజ్?

image

అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వెంకటేశ్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ అభిమానులకు మేకర్స్ సర్‌ప్రైజ్ ఇవ్వనున్నట్లు సమాచారం. మార్చి 1న జీతెలుగులో సినిమా ప్రసారం కానుండగా థియేటర్‌లో డిలీట్ చేసిన సన్నివేశాలను కూడా ఇందులో జోడించనున్నట్లు తెలుస్తోంది. అలాగే అదే రోజే జీ5లో స్ట్రీమింగ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు టాక్. కాగా ఈ చిత్రం రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించిన విషయం తెలిసిందే.

error: Content is protected !!