News February 25, 2025
సిద్దిపేట: ఏడుపాయల జాతరకు భారీగా బస్సులు

ఏడుపాయల జాతరకు భారీగా ఆర్టీసీ బస్సులను అధికారులు నడపనున్నారు. ఈ నెల 26 నుంచి 28 తేదీ వరకు మూడు రోజుల పాటు ఏడుపాయల జాతర కొనసాగనుంది. హైదరాబాద్, సికింద్రాబాద్, జేబీఎస్ నుంచి 300 బస్సులు, పటాన్చెరు, నారాయణఖేడ్, జహీరాబాద్ డిపోల నుంచి మరో 50 చొప్పున మొత్తం 400 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ అధికారులు నడపనున్నారు. రద్దీని బట్టి మరిన్ని బస్సులు నడుపుతామని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
Similar News
News February 25, 2025
మల్లాపూర్: పచ్చదనం నింపుకున్న చెట్టు

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం నడికుడ గ్రామంలోని ఒక చెట్టు నిండుగా ఆకుపచ్చ ఆకులతో మనసుని ఆకట్టుకుంటుంది. కొత్తగా ఆకులు చిగురించడంతో చెట్టు మొత్తం పచ్చని ఆకులతో వత్తుగా పెరగడంతో, పచ్చదనంతో చూడగానే మనసుని ఆకర్షించేలా కనిపిస్తుంది. ఈ అరుదైన దృశ్యం కెమెరాకి మంగళవారం చిక్కింది. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి.
News February 25, 2025
రాహుల్ గాంధీతో శశిథరూర్కు పడటం లేదా!

అధిష్ఠానంతో కాంగ్రెస్ MP శశిథరూర్కు పొసగడం లేదా? BJP, మోదీ, LDFపై ఆయన స్వేచ్ఛగా అభిప్రాయాలు వ్యక్తం చేయడం రాహుల్, సోనియాకు నచ్చడం లేదా? ఈ విభేదాలు ఇప్పుడు మరింత ముదిరాయా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. ‘నా అవసరం మీకు లేకుంటే నాకు ఆప్షన్స్ ఉన్నాయి’ అని థరూర్ స్పష్టం చేయడాన్ని ఉదహరిస్తున్నారు. దీన్నిబట్టి రాబోయే రోజుల్లో కేరళ రాజకీయాలు రసవత్తరంగా మారొచ్చని అంటున్నారు. దీనిపై మీ కామెంట్.
News February 25, 2025
దుద్యాల్: లగచర్ల రైతులు ఇండస్ట్రియల్ పార్కుకు సహకరిస్తున్నారు: కలెక్టర్

లగచర్ల రైతులు స్వచ్ఛందంగా ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణానికి సహకరిస్తున్నారని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ ప్రతీక్ జైన్ దుద్యాల మండలం లగచర్ల ఇండస్ట్రియల్కు సంబంధించి తమ భూమి స్వచ్ఛందంగా ఇచ్చిన 22 మంది రైతులకు చెక్కులు పంపిణి చేశారు. భూములు ఇస్తున్న రైతులకు నష్టపరిహారాలు అందించి ప్రభుత్వం తరఫున ప్రోత్సహిస్తామని ఆయన తెలిపారు.