News February 25, 2025

లాభాల్లో స్టాక్ మార్కెట్

image

నిన్న నష్టాల్లో కొనసాగిన స్టాక్ మార్కెట్ ఇవాళ పుంజుకుంటోంది. సెన్సెక్స్ 117 పాయింట్లు పెరిగి 74,571 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా నిఫ్టీ 31 పాయింట్లు పెరిగి 22,584 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. మారుతీ సుజుకీ, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్ టెల్ లాభాల్లో కొనసాగుతుండగా సన్ ఫార్మా, హిందాల్కో, కోల్ ఇండియా, లార్సెన్ నష్టాల్లో ఉన్నాయి.

Similar News

News February 25, 2025

బూతులు, గొడవలకు వైసీపీ నేతలు పర్యాయపదాలు: పవన్

image

AP: అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగిస్తుంటే YCP నేతలు ఇష్టారీతిగా ప్రవర్తించారని డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘గవర్నర్ ప్రసంగాన్ని వాళ్లు బహిష్కరించడం బాధాకరం. MLAలు అందరికీ ఆదర్శంగా ఉండాలి. YCP నేతలు గొడవలు, బూతులకు పర్యాయపదాలుగా మారారు. చట్టాలు చేయాల్సిన వాళ్లే నియమాలు ఉల్లంఘిస్తే ఎలా? అసెంబ్లీలోనే ఇలా ప్రవర్తించిన వాళ్లు బయట ఇంకెలా ఉంటారో?’ అని సందేహం వ్యక్తం చేశారు.

News February 25, 2025

అహంకారంతో సిబ్బందిపై చేయి.. మంత్రి రాజీనామా

image

సిబ్బందితో అమర్యాదగా ప్రవర్తించినందుకు న్యూజిలాండ్‌లో ఓ మంత్రి పదవి ఊడింది. ఆండ్రూ బేలీ ఇతరులతో చర్చిస్తున్న సమయంలో సిబ్బంది భుజంపై చేయి వేశాడు. ఈ ఘటనపై తీవ్ర దుమారం చెలరేగడంతో ఆయన తన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ టైంలో తాను కొంచెం అహంకారపూరితంగా ప్రవర్తించానని ఆండ్రూ అంగీకరించారు. ఆయన గతంలో కూడా తాగి ఓ సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించాడని విమర్శలు ఎదుర్కొన్నారు.

News February 25, 2025

10% సీట్లు లేకపోయినా ప్రతిపక్ష హోదా.. ‘ఢిల్లీ’ ఓ ఉదాహరణ

image

APలో ప్రధాన ప్రతిపక్ష హోదా అంశం హాట్‌టాపిక్‌గా మారింది. YCPకి 10% సీట్లు(18) లేనందున తాము ఆ హోదా కల్పించబోమని కూటమి నేతలు స్పష్టం చేస్తున్నారు. ఏకైక ప్రతిపక్ష పార్టీకి అపోజిషన్ స్టేటస్ ఇవ్వొచ్చని ‘ఢిల్లీ’ని ఉదాహరణగా వైసీపీ చూపిస్తోంది. 2015లో 70 సీట్లకుగాను ఆప్ 67 స్థానాలు, బీజేపీ 3 చోట్ల గెలిచింది. 10% సీట్లు(7) లేకపోయినా స్పీకర్ రామ్ నివాస్ BJP నేత విజేందర్ గుప్తాను ప్రతిపక్ష నేతగా గుర్తించారు.

error: Content is protected !!