News February 25, 2025
పార్వతీపురం: 48 గంటల పాటు మద్యం దుకాణాలు బంద్

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జిల్లాలోని అన్ని మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాల్లో 48 గంటల పాటు అమ్మకాలు నిలిపివేస్తున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ శ్రీనాథుడు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం నాలుగు గంటల వరకు మూసివేయాలన్నారు. వచ్చే నెల మూడో తేదీన ఓట్ల లెక్కింపు రోజున కూడా వీటిని మూసివేయాలని ఆదేశించారు.
Similar News
News January 18, 2026
అన్నమయ్య: ఇద్దరు యువకుల మృతి

అన్నమయ్య జిల్లాలో ఇద్దరు యువకులు మృతిచెందడం కలకలం రేపింది. KVపల్లె మండలం బండ వడ్డిపల్లి గ్రామానికి చెందిన కొందరు యువకులు శనివారం రాత్రి 8గంటల సమయంలో మద్యం తాగారు. అందులో ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. స్థానికులు వెంటనే గర్నిమిట్ట ఆసుపత్రికి తరలించగా మణికుమార్(34) చనిపోయాడు. పరిస్థితి విషమించిన పుష్పరాజ్(26)ను పీలేరు ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ మృతిచెందాడు. మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
News January 18, 2026
మీ ఇంట్లో సూర్యుడి విగ్రహం ఉందా?

చాలామంది ఇళ్లల్లో దేవుళ్ల విగ్రహాలు ఉంటాయి. కానీ సూర్యుడి విగ్రహాన్ని మాత్రం పెట్టుకోకూడదని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే సూర్యుడు మనకు రోజూ ప్రత్యక్ష దైవంగా కనిపిస్తాడు. ఉదయాన్నే సూర్యోదయ సమయంలో ఆ భాస్కరుడిని చూస్తూ నమస్కరించుకోవడం, అర్ఘ్యం వదలడం శ్రేష్ఠం. ప్రకృతిలోనే దైవాన్ని దర్శించుకునే అవకాశం ఉన్నప్పుడు, విగ్రహ రూపం కంటే నేరుగా సూర్యుడిని ఆరాధించడమే అత్యంత శక్తివంతమైన ఫలితాలను ఇస్తుంది.
News January 18, 2026
బిడ్డ ఆరోగ్యం కోసం ఎలాంటి ఆహారాలు తీసుకోవాలంటే?

ప్రెగ్నెన్సీలో బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే తల్లి పీచు ఎక్కువగా ఉండే పప్పులు, బీన్స్, బఠానీ, బెర్రీ పండ్లు, నట్స్, డ్రైఫ్రూట్స్తీసుకోవాలి. కాల్షియం కోసం పాలు, పాల పదార్థాలు, ఆకుకూరలు, గుడ్లు, సపోటా, చేపలు తీసుకోవాలి. ఐరన్ లోపం రాకుండా ఆప్రికాట్స్, కోడిగుడ్లలోని పచ్చసొన, చేపలు, డ్రైఫ్రూట్స్, ఆకుకూరలు, ఆకుపచ్చటి కాయగూరలు, ఓట్స్, చిరుధాన్యాలు, గోధుమలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.


