News February 25, 2025
రైలు కిందపడి కాసిపేట యువకుడి సూసైడ్

మంచిర్యాల జిల్లా కాసిపేట మండలానికి చెందిన యువకుడు రైలు కిందపడి సూసైడ్ చేసుకున్నట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ రాజేశ్వర్ తెలిపారు. మండల కేంద్రానికి చెందిన క్రాంతి(29) ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు, వివాహం కావడం లేదని మనస్తాపానికి గురై కల్వరి చర్చి వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు. రైల్వే ఎస్ఐ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.
Similar News
News January 21, 2026
RGSSHలో ఇంటర్వ్యూతో ఉద్యోగాలు

రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్(RGSSH) 14 సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి MBBS, DNB, PG డిప్లొమా, MS/MD, MCh, DM అర్హతతో పాటు పని అనుభవం గలవారు జనవరి 28న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 37ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. వెబ్సైట్: https://rgssh.delhi.gov.in
News January 21, 2026
సింగరేణి బాధ్యత కేంద్రం తీసుకుంటుంది: కిషన్రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం అంగీకరిస్తే సింగరేణి నిర్వహణ బాధ్యత కేంద్రం తీసుకుంటుందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. మంత్రుల మధ్య వాటాల గొడవతోనే సింగరేణి వివాదం వెలుగులోకి వచ్చిందని తెలిపారు. అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించి సీఎం రేవంత్కు లేఖ రాస్తానని పేర్కొన్నారు.
News January 21, 2026
SKLM: తమన్ మ్యూజికల్ షోకు పగడ్బందీ ఏర్పాట్లు

తమన్ మ్యూజికల్ షోకు పగడ్బందీగా బారికేడ్లు నిర్మించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన ఎస్సీ కేవీ మహేశ్వర్ రెడ్డితో కలిసి స్థలాన్ని పరిశీలించారు. ప్రేక్షకులు వేలాది సంఖ్యలో వచ్చే పరిస్థితి ఉన్నందున తగిన జాగ్రత్తలు కింది స్థాయి అధికారులకు సూచించారు. వేడుకలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదని, ప్రవేశ, నిష్క్రమణ గేట్లు సక్రమంగా ఉండాలన్నారు.


