News February 25, 2025
రంపచోడవరం: ‘జాగ్రత్తలు తీసుకుని చికెన్ అమ్ముకోవచ్చు’

కొన్ని జాగ్రత్తలు తీసుకుని చికెన్, గుడ్ల అమ్మకాలు మంగళవారం నుంచి చేసుకోవచ్చని రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. చికెన్ షాపుల వద్ద పారిశుద్ధ్య కార్యక్రమాలను ఎప్పటికప్పుడు నిర్వహించుకోవాలన్నారు. పరిశుభ్రత పాటించాలన్నారు. కోళ్ల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు షాపు ఓనర్లు పర్యవేక్షించాలన్నారు. బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాపించిన ప్రాంతాల నుంచి కోళ్లను తరలించవద్దన్నారు.
Similar News
News September 16, 2025
మైథాలజీ క్విజ్ – 7

1. మహావిష్ణువు ద్వారపాలకులెవరు?
2. అయోధ్య నగరం ఏ నది ఒడ్డున ఉంది?
3. భీష్ముడి అసలు పేరేంటి?
4. గంగోత్రి ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది?
5. భాద్రపద మాసంలో చవితి రోజున వచ్చే పండుగ ఏది?
– సరైన సమాధానాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. పై ప్రశ్నలకు జవాబులను మైథాలజీ క్విజ్ – 8 (రేపు 7AM)లో పబ్లిష్ చేస్తాం.
<<17697694>>మైథాలజీ క్విజ్-6 <<>>జవాబులు: 1.18 వేలు 2.దండకారణ్యం 3.మధుర 4.గుజరాత్ 5.రాఖీ
News September 16, 2025
సిక్కోలు జిల్లాలో డీఎస్సీకి ఎంతమంది ఎంపికయ్యారంటే ?

శ్రీకాకుళం జిల్లాలో డీఎస్సీ-2025లో ఎంపికైన జాబితాను తాజాగా విద్యాశాఖ వెల్లడించింది. జిల్లాలో 543 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహించగా 535 మంది ఎంపికయ్యారు. ఇందులో ఎస్ఏ-391, ఎస్జీటీ-144 మంది ఎంపికయ్యారని అధికారులు వెల్లడించారు. ఎంపికైన వారికి ఈనెల 19న విజయవాడలో సీఎం చంద్రబాబు నాయుడు చేతులు మీదుగా నియామకపత్రాలు అందించనున్నారు.
News September 16, 2025
ఏలూరు: ఆర్ఐహెచ్ సీఈఓగా ధాత్రి రెడ్డి

రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్ఐహెచ్) సీఈఓగా 2020 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి ధాత్రి రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆమె ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఆమెకు ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ సొసైటీ సీఈఓగా అదనపు బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రంలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో ఆమె కీలక పాత్ర పోషించనున్నారు.