News February 25, 2025

టాటా గ్రూప్ నుంచి IPOకు మరో కంపెనీ

image

టాటా గ్రూప్ నుంచి మరో కంపెనీ పబ్లిక్ ఇష్యూకు రానుంది. IPO ప్రణాళికలను ఆమోదించినట్టు టాటా క్యాపిటల్ మంగళవారం తెలిపింది. ఫ్రెష్ ఇష్యూ కింద 23 కోట్ల ఈక్విటీ షేర్లు, ఇప్పటికే ఉన్న షేర్ హోల్డర్లకు OFS కింద స్టాక్స్ ఇవ్వనుంది. రూ.1504 కోట్ల విలువైన షేర్లను రైట్స్ ఇష్యూ కింద కేటాయిస్తోంది. నోటిఫై చేసిన మూడేళ్లలో అప్పర్ లేయర్ NBFCలు IPOకు రావాలన్న RBI నిబంధనల మేరకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.

Similar News

News February 25, 2025

10% సీట్లు లేకపోయినా ప్రతిపక్ష హోదా.. ‘ఢిల్లీ’ ఓ ఉదాహరణ

image

APలో ప్రధాన ప్రతిపక్ష హోదా అంశం హాట్‌టాపిక్‌గా మారింది. YCPకి 10% సీట్లు(18) లేనందున తాము ఆ హోదా కల్పించబోమని కూటమి నేతలు స్పష్టం చేస్తున్నారు. ఏకైక ప్రతిపక్ష పార్టీకి అపోజిషన్ స్టేటస్ ఇవ్వొచ్చని ‘ఢిల్లీ’ని ఉదాహరణగా వైసీపీ చూపిస్తోంది. 2015లో 70 సీట్లకుగాను ఆప్ 67 స్థానాలు, బీజేపీ 3 చోట్ల గెలిచింది. 10% సీట్లు(7) లేకపోయినా స్పీకర్ రామ్ నివాస్ BJP నేత విజేందర్ గుప్తాను ప్రతిపక్ష నేతగా గుర్తించారు.

News February 25, 2025

తొలిరోజు ముగిసిన వంశీ కస్టడీ

image

AP: వైసీపీ నేత వల్లభనేని వంశీ పోలీస్ కస్టడీ తొలిరోజు ముగిసింది. రెండున్నర గంటల పాటు పోలీసులు ఆయన్ను పలు అంశాలపై విచారించారు. టీడీపీ కార్యాలయంపై దాడి ఎవరి ఆదేశాలతో చేయించారు? ఎందుకు చేయించారు? సత్యవర్ధన్ స్టేట్‌మెంట్‌పైనా మరికొన్ని ప్రశ్నలను పోలీసులు సంధించారు. అనంతరం వైద్య పరీక్షల కోసం వంశీని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి, ఆ తర్వాత జిల్లా జైలులో విడిచిపెట్టనున్నారు.

News February 25, 2025

Stock Markets: ఉదయం లాభాలు.. సాయంత్రం నష్టాలు

image

స్టాక్‌మార్కెట్లు నేడు ఫ్లాటుగా ముగిశాయి. నిఫ్టీ 22,547 (-5), సెన్సెక్స్ 74,602 (147) వద్ద స్థిరపడ్డాయి. ఆటో, మీడియా, ఎఫ్ఎంసీజీ, కన్జూమర్ డ్యురబుల్స్ షేర్లు ఎగిశాయి. ఐటీ, మెటల్, ఫార్మా, PSU బ్యాంకు, రియాల్టి, O&G షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. ఎయిర్‌టెల్, ఎం&ఎం, బజాజ్ ఫైనాన్స్, నెస్లే ఇండియా, టైటాన్ టాప్ గెయినర్స్. డాక్టర్ రెడ్డీస్, హిందాల్కో, ట్రెంట్, హీరోమోటో, సన్‌ఫార్మా టాప్ లూజర్స్.

error: Content is protected !!