News February 25, 2025

వంశీపై మరో కేసు

image

AP: వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు నమోదైంది. గన్నవరంలో తమ పేరిట ఉన్న రూ.10 కోట్ల విలువైన స్థలం కబ్జా చేశారని హైకోర్టు లాయర్ సతీమణి సుంకర సీతామహాలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వంశీతో పాటు మరో 15 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఇప్పటికే జైలులో ఉన్న వంశీపై అక్రమ మైనింగ్, భూకబ్జాల ఆరోపణలపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది.

Similar News

News February 25, 2025

Nifty Worst Record: 30 ఏళ్లలో రెండోసారి వరుసగా 5 నెలలు నష్టాలే..

image

నిఫ్టీ50 ఇన్వెస్టర్లు కోరుకోని రికార్డును నమోదు చేసింది. సూచీ ఆరంభం నుంచి 30 ఏళ్లలో రెండోసారి వరుసగా 5 అంతకన్నా ఎక్కువ నెలలు పతనమైంది. 2024 OCT – 2025 FEB మధ్య 5 నెలలు దిగజారింది. 12.6% నష్టపోయింది. ఇది ఇంకా కొనసాగే అవకాశముంది. 1994 SEP – 1995 APR మధ్యన నిఫ్టీ ఏకంగా 8 నెలలు కుంగింది. 31.4% పతనమైంది. ఇక 1996 JUL – NOV మధ్య 5 నెలల్లో 26% తగ్గింది. 1990, 1998, 2001లో వరుసగా 4 నెలలు నష్టపోయింది.

News February 25, 2025

వారానికి 48గంటల పని చాలు: అశ్విన్ యార్ది

image

‘క్యాప్‌జెమినీ’ ఇండియా సీఈఓ అశ్విన్ యార్ది ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగి రోజుకు 9.30గంటల చొప్పున వారానికి ఐదు రోజులు పనిచేస్తే సరిపోతుందని తెలిపారు. అంతేకాకుండా వారాంతాల్లో ఉద్యోగులను ఇబ్బంది పెట్టకూడదని వారికి మెయిల్స్ పంపడానికి తాను వ్యతిరేకమని అన్నారు. అయితే గతంలో ఎల్ అండ్ టీ ఛైర్మన్ సుబ్రహ్మణ్యన్ వారంలో 90 గంటలు పనిచేయాలన్న వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.

News February 25, 2025

ఇంటర్నెట్ షట్‌డౌన్‌లో భారత్ టాప్

image

2024లో ప్రపంచవ్యాప్తంగా 54 ప్రజాస్వామ్య దేశాల్లో 296 సార్లు ఇంటర్‌నెట్‌ను నిలిపివేసినట్లు Access Now సంస్థ వెల్లడించింది. 84సార్లు షట్‌డౌన్‌తో భారత్ వరుసగా ఆరో ఏడాది టాప్‌లో నిలిచింది. మణిపుర్‌లో 21, హరియాణాలో 12, J&Kలో 12 సార్లు ఇంటర్నెట్ ఆపేశారు. పాక్‌ 21, రష్యా 19, ఉక్రెయిన్ 7సార్లు నెట్ నిలిపేశాయి. మయన్మార్‌లో 85సార్లు ఆపేసినా అది మిలిటరీ ప్రభుత్వం కావడంతో జాబితాలో చేర్చలేదు.

error: Content is protected !!