News February 25, 2025

భక్తులపై ఏనుగులు దాడి.. హోంమంత్రి అనిత ఘటనపై ఆరా

image

భక్తులపై ఏనుగుల దాడి చేసిన ఘటనపై హోంమంత్రి అనిత ద్రిగ్భాంతి వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లాలోని వైకోట సమీపంలో గుడాలకోన వద్ద జరిగిన ఈ ఘటనపై ఎస్పీ విద్యాసాగర్‌తో హోంమంత్రి మాట్లాడారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని ఏనుగుల దాడిలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గుండాల కోనకు వెళ్లే భక్తులకు మరింత భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు.

Similar News

News December 27, 2025

విశాఖలో మాతా శిశు మరణాల పరిస్థితి ఇదే..

image

విశాఖ జిల్లాలో గత ఏడాదితో పోలిస్తే మాతా శిశు మరణాల్లో తగ్గుదల కనిపిస్తోంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2023-24 ఏడాదిలో 25,456 శిశువులు జన్మించగా 102 శిశు, 20 మాతృ మరణాలు, 2024-25 ఏడాదిలో 24,198 శిశువులు జన్మించగా 324 శిశు, 14 మాతృ మరణాలు సంభవించాయి. 2025-26 ఏడాదిలో 14,880 శిశువులు జన్మించగా 70 శిశు, 7 మాతృ మరణాలు నమోదు అయ్యాయి.

News December 27, 2025

విశాఖలో స్వల్పంగా తగ్గిన గుడ్డు ధర!

image

గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయికి చెరుకున్న గుడ్డు హోల్ సేల్ ధర స్వల్పంగా తగ్గింది. నిన్నటి వరకు ట్రే(30 గుడ్లు) రూ.220 ఉంటే ఈ రోజు రూ.210 ఉంది. హోల్ సేల్ గుడ్డు రూ. 7కు అమ్ముతున్నారు. రిటైల్లో మాత్రం గుడ్డు 8 రూపాయలు ఉంది. గత నెల రోజులుగా ధర పెరుగుతుండగా.. ప్రస్తుతం 100 గుడ్లకు గాను రూ.36 తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. ఇక నుంచి గుడ్డు ధర నిలకడగా ఉండే అవకాశం ఉండొచ్చని భావిస్తున్నారు.

News December 27, 2025

విశాఖలో ఒక రోజు ముందే పింఛన్ల పంపిణీ

image

నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1న ఇవ్వాల్సిన సామాజిక భద్రతా పింఛన్లను డిసెంబర్ 31న ముందుగానే పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఆ రోజు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేస్తారని చెప్పారు. పంపిణీ సజావుగా జరిగేందుకు డిసెంబర్ 30న నగదు డ్రా చేసేందుకు ఆదేశించినట్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.