News February 25, 2025

సీఎం చంద్రబాబును కలిసిన వీహెచ్

image

AP: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. నిన్న విజయవాడలో ఆయనను కలిసి.. ఏపీలోని ఒక జిల్లాకు దివంగత సీఎం దామోదరం సంజీవయ్య పేరును పెట్టాలని, స్మృతివనం నిర్మించాలని కోరారు. ఇందుకు చంద్రబాబు సానుకూలంగా స్పందించారని, దళిత సీఎం అయిన సంజీవయ్య అత్యంత నిజాయితీపరుడని వీహెచ్ పేర్కొన్నారు.

Similar News

News November 12, 2025

AP న్యూస్ రౌండప్

image

* స్వచ్ఛ కార్యక్రమాల అమలులో విశాఖ పోర్టు అథారిటీ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ముంబైలో కేంద్ర మంత్రి సర్బానంద చేతుల మీదుగా పోర్టు ఛైర్మన్ అంగముత్తు అవార్డు స్వీకరించారు.
* రేపటి నుంచి సత్యసాయి శతజయంతి ఉత్సవాలు జరగనున్నాయి. 19న PM మోదీ, 22న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, 23న రాష్ట్రపతి ముర్ము హాజరుకానున్నారు.
* వర్సిటీలన్నింటికీ ఒకే చట్టం తీసుకొచ్చేందుకు ఉన్నత విద్యాశాఖ కసరత్తు తుదిదశకు చేరుకుంది.

News November 12, 2025

అయోడిన్ లోపంతో పిల్లల్లో ఎదుగుదల సమస్యలు

image

థైరాయిడ్ హార్మోన్లు, ట్రైయోడోథైరోనిన్ (T3), థైరాక్సిన్ (T4) సరైన మోతాదులో విడుదల కావడానికి అయోడిన్ చాలా అవసరం. అయితే అయోడిన్‌ లోపాలున్న పిల్లలు అత్యధికంగా దేశంలో ఆంధ్రప్రదేశ్‌లోనే 82.5% ఉన్నట్లు చిల్డ్రన్ ఇన్ ఇండియా నివేదిక తెలిపింది. దీనిలోపంతో పిల్లల్లో ఎదుగుదల సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. చేపలు, సముద్ర ఆహారం, పాలు, గుడ్లు, సోయా ఉత్పత్తుల్లో అయోడిన్‌ అధికంగా ఉంటుంది.

News November 12, 2025

ఆస్పత్రిలో చేరిన మరో సీనియర్ నటుడు

image

బాలీవుడ్ సీనియర్ నటుడు గోవింద(61) ముంబై క్రిటికేర్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతున్న దిగ్గజ నటుడు ధర్మేంద్రను నిన్న ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన గోవింద ఇంట్లో రాత్రి సమయంలో కుప్పకూలిపోయారు. దీంతో అర్ధరాత్రి ఒంటిగంటకు ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు లీగల్ అడ్వైజర్ లలిత్ బిందాల్ తెలిపారు. ఆయనకు పలు టెస్టులు చేశారని, వాటి రిజల్ట్స్ వస్తే అనారోగ్యానికి కారణం తెలుస్తుందన్నారు.