News February 25, 2025

సిద్దిపేట: దంచి కొడుతున్న ఎండ

image

సిద్దిపేట జిల్లాలో రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతోంది. ప్రతి ఏడాది మార్చిలో కనిపించే ఎండ ప్రభావం ఈ ఏడాది ముందుగానే కనిపిస్తోంది. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సాధారణం కంటే ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండు, మూడు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.

Similar News

News February 25, 2025

ఎమ్మెల్సీ ఎన్నికలు.. 200 మంది పోలీస్ ఫోర్స్: ములుగు SP

image

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ములుగు ఎస్పీ శబరీశ్ మంగళవారం తెలిపారు. జిల్లాలోని 9 పోలింగ్ కేంద్రాల వద్ద 200 మంది పోలీస్ సిబ్బంది విధులు నిర్వహించనున్నట్లు ఎస్పీ చెప్పారు. పోలింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, బూత్ వద్ద 100, 200 మీటర్ల పరిధిలో ఎన్నికల నియమావళి ప్రకారం ఆంక్షలు ఉంటాయన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేయాలని సూచించారు.

News February 25, 2025

Nifty Worst Record: 30 ఏళ్లలో రెండోసారి వరుసగా 5 నెలలు నష్టాలే..

image

నిఫ్టీ50 ఇన్వెస్టర్లు కోరుకోని రికార్డును నమోదు చేసింది. సూచీ ఆరంభం నుంచి 30 ఏళ్లలో రెండోసారి వరుసగా 5 అంతకన్నా ఎక్కువ నెలలు పతనమైంది. 2024 OCT – 2025 FEB మధ్య 5 నెలలు దిగజారింది. 12.6% నష్టపోయింది. ఇది ఇంకా కొనసాగే అవకాశముంది. 1994 SEP – 1995 APR మధ్యన నిఫ్టీ ఏకంగా 8 నెలలు కుంగింది. 31.4% పతనమైంది. ఇక 1996 JUL – NOV మధ్య 5 నెలల్లో 26% తగ్గింది. 1990, 1998, 2001లో వరుసగా 4 నెలలు నష్టపోయింది.

News February 25, 2025

వారానికి 48గంటల పని చాలు: అశ్విన్ యార్ది

image

‘క్యాప్‌జెమినీ’ ఇండియా సీఈఓ అశ్విన్ యార్ది ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగి రోజుకు 9.30గంటల చొప్పున వారానికి ఐదు రోజులు పనిచేస్తే సరిపోతుందని తెలిపారు. అంతేకాకుండా వారాంతాల్లో ఉద్యోగులను ఇబ్బంది పెట్టకూడదని వారికి మెయిల్స్ పంపడానికి తాను వ్యతిరేకమని అన్నారు. అయితే గతంలో ఎల్ అండ్ టీ ఛైర్మన్ సుబ్రహ్మణ్యన్ వారంలో 90 గంటలు పనిచేయాలన్న వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.

error: Content is protected !!