News February 25, 2025
ఉద్యోగాల కల్పనపై శాసనమండలిలో గందరగోళం

AP: బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్తో అబద్ధాలు చెప్పించారని YCP MLC వరుదు కళ్యాణి విమర్శించారు. దీంతో అధికార పార్టీ నేతలు మండిపడ్డారు. 4లక్షల ఉద్యోగాలు కల్పించామని ప్రభుత్వం చెప్పినట్లు ఆమె మాట్లాడగా.. మంత్రి లోకేశ్ జోక్యం చేసుకున్నారు. 4లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యం అని చెప్పామని, కల్పించామని చెప్పలేదన్నారు. YCP సభ్యులు వాస్తవాలు మాట్లాడాలని, వాకౌట్ చేయకుండా కూర్చుంటే చర్చిద్దాం అని తెలిపారు.
Similar News
News November 6, 2025
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఉచిత వైద్యం: పొన్నం

TG: కేంద్రం ప్రవేశ పెట్టిన పథకంతో రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారికి రూ.లక్షన్నర వరకు ఫ్రీ వైద్యం అందిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రోడ్డు భద్రతా చర్యలపై ఓ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, మృతుల సంఖ్య అధికంగా ఉండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు విద్యా సంస్థల్లో రోడ్ సేఫ్టీ, రూల్స్పై వ్యాసరచన పోటీలు నిర్వహించాలని సూచించారు.
News November 6, 2025
HLL లైఫ్కేర్ లిమిటెడ్లో 354 పోస్టులు

<
News November 6, 2025
ధాన్యం నిల్వలో తేమ శాతం ముఖ్యం

ధాన్యాన్ని నిల్వచేసేటప్పుడు తేమ 14% కన్నా ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి. గింజలలో తేమ శాతం తక్కువగా ఉంటే ధాన్యం రంగు మారదు, బూజు పట్టదు, కీటకాలు ఆశించవు. ధాన్యంలో తేమ 14%కు మించినప్పుడు, నిల్వ చేసే పద్ధతి సరిగా లేనప్పుడు ధాన్యానికి కీటకాలు, తెగుళ్లు ఆశించి నష్టం జరుగుతుంది. అందుకే ధాన్యాన్ని ఎక్కువ కాలం నిల్వ చేసేప్పుడు మధ్యలో అప్పుడప్పుడు చీడపీడలను పరిశీలిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.


