News February 25, 2025
కొడంగల్: సీఎం రేవంత్ సెంటిమెంట్ ఆలయం ఇదే.!

కొడంగల్ పట్టణంలోని శ్రీ గాడిబావి శివాలయం అంటే సీఎం రేవంత్ రెడ్డి సెంటిమెంటుగా భావిస్తారు. 300 ఏండ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయంలోని శివలింగం అతిపెద్ద పాణివాటం, బ్రహ్మసూత్రం కలిగి ఉంటుంది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ఇక్కడే నామినేషన్ పత్రాలకు పూజలు చేసి, నామినేషన్ వేశారు. భారీ మెజారిటీతో విజయం సాధించి.. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు.
Similar News
News February 25, 2025
ఢిల్లీకి సీఎం రేవంత్.. రేపు ప్రధానితో భేటీ

TG: సీఎం రేవంత్ కాసేపటి క్రితం ఢిల్లీకి బయల్దేరారు. రేపు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టుల నిధులపై విజ్ఞప్తులు చేసే అవకాశముంది. పీఎంతో భేటీ అనంతరం ఆయన కుంభమేళాకు వెళ్లే అవకాశం ఉంది. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళా రేపటితో ముగియనున్న సంగతి తెలిసిందే. కుంభమేళాకు రావాలని యూపీ ప్రభుత్వం గతంలోనే సీఎం రేవంత్ను ఆహ్వానించింది.
News February 25, 2025
పీ-4 సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

పీ-4 సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. నాగులుప్పలపాడు మండలంలోని పోతవరం గ్రామంలో మంగళవారం ఆమె పర్యటించారు. గ్రామంలో పీ-4 సర్వేతో పాటు భూముల రీసర్వే జరుగుతున్న తీరును పరిశీలించారు. పీ-4 సర్వేలో భాగంగా స్థానికులతో మాట్లాడి వారి కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరుపై ఆరా తీశారు.
News February 25, 2025
ఇటిక్యాల: పనుల పురోగతిపై పరిశీలన

ఇటిక్యాల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ తనిఖీ చేశారు. ప్రభుత్వ పథకాల అమలు తీరు, ఉపాధి హామీ పనులు, రాబోయే వేసవి కాలంలో నీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు తదితర పనులు పరిశీలించారు. అధికారులకు సంబంధిత పనుల పురోగతి గురించి ఆదేశాలు ఇచ్చారు. జిల్లా, మండల అధికారులు, ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.