News February 25, 2025
ప్రత్యేక హోదా అంశంపై మండలిలో రభస

AP: రాష్ట్రానికి ప్రత్యేకహోదా అంశంపై మండలిలో రభస జరిగింది. ‘హోదా ఎందుకు తేవట్లేదు?’ అని YCP సభ్యులు ప్రశ్నించగా మంత్రి లోకేశ్ స్పందించారు. ‘రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీయేకు మద్దతు తెలిపాం. మాపైనే కేంద్రం ఆధారపడినట్లు మేము చెప్పినట్లు వక్రీకరిస్తున్నారు. మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని జగన్ అన్నారు.. ఏమైంది.? ఏడాదిలో రూ.13వేల కోట్లు తెచ్చాం. YCP 5ఏళ్లలో ఏం సాధించింది’ అని లోకేశ్ ప్రశ్నించారు.
Similar News
News January 23, 2026
జగన్ ఖాతాకు శ్రీలంక VPN.. ‘X’ ఏం చెబుతోందంటే?

AP: వైసీపీ అధినేత జగన్ తన ‘X(ట్విటర్)’ ఖాతాకు శ్రీలంక VPN(వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్) వాడుతున్నారంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆయన హ్యాండిల్లో ‘Account based in Sri Lanka’ అని చూపిస్తోందని నెటిజన్లు స్క్రీన్ షాట్లు షేర్ చేస్తున్నారు. అయితే ఈ డేటా కచ్చితమైనది కాకపోవచ్చని, ఇంటర్నెట్ ప్రొవైడర్లు యూజర్లకు తెలియకుండానే VPN వంటి ప్రాక్సీలను ఉపయోగించవచ్చని ‘X’ చెబుతోంది.
News January 23, 2026
రెండు వారాల్లో గ్రీన్లాండ్పై క్లారిటీ: ట్రంప్

గ్రీన్లాండ్ డీల్ విషయంలో పురోగతి కనిపిస్తోందని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి దానికి సంబంధించిన వ్యవహారాలు సజావుగా సాగుతున్నాయని.. మరో 2 వారాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. గతకొన్ని వారాలుగా గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకుంటామంటూ ఆయన హెచ్చరిస్తున్న నేపథ్యంలో తాజా వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఓ దశలో సైనిక చర్యకూ వెనకాడబోమని హెచ్చరించినప్పటికీ తర్వాత వెనక్కి తగ్గారు.
News January 23, 2026
రేషన్ బియ్యంతోపాటు నిత్యావసరాలు: ఉత్తమ్

TG: రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుభవార్త చెప్పారు. రేషన్ బియ్యంతోపాటు ఇతర నిత్యావసర సరుకులు అందించేందుకు యోచిస్తున్నామని తెలిపారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఇచ్చినట్లుగానే నిత్యావసరాలు కూడా ఇచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. మరోవైపు 2025-26 వానాకాలం సీజన్లో 71.70 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి.. రైతుల ఖాతాల్లో రూ.18వేల కోట్లు జమ చేసినట్లు తెలిపారు.


