News March 21, 2024

ఎల్లుండి మధ్యాహ్నం 3 గంటలకు విడుదల

image

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్. జూన్ నెలకు సంబంధించి వృద్ధులు/దివ్యాంగుల ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా టికెట్లను మార్చి 23న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తామని టీటీడీ ప్రకటించింది. అలాగే శ్రీవాణి ట్రస్ట్ దాతలకు అదే రోజు ఉదయం 11 గంటలకు దర్శనం టోకెన్లు విడుదల చేస్తామని తెలిపింది. ఇక రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లను మార్చి 25న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తామని వెల్లడించింది.

Similar News

News July 8, 2024

‘హరోమ్‌హర’లో ప్రణీత్.. క్షమాపణలు చెప్పిన హీరో

image

పిల్లలపై అసభ్యకర కామెంట్స్ చేసిన యూట్యూబర్‌ <<13586460>>ప్రణీత్<<>> హనుమంతు తన సినిమా ‘హరోమ్‌హర’లో నటించినందుకు చింతిస్తున్నట్లు హీరో సుధీర్ బాబు తెలిపారు. చిత్రయూనిట్‌ తరఫున తాను క్షమాపణలు చెబుతున్నట్లు X వేదికగా ప్రకటించారు. ఇతను ఇంతటి నీచమైన వ్యక్తి అని తమకు తెలియదని పేర్కొన్నారు. వీరి కామెంట్స్ ఏ మాత్రం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కిందకి రావని స్పష్టం చేశారు.

News July 8, 2024

అలా అయితే రీ-నీట్‌కు ఆదేశిస్తాం: సుప్రీం

image

నీట్ పవిత్రతను NTA దెబ్బతీసిందని రుజువైనా, నేరం చేసిన వారిని గుర్తించలేకపోయినా రీ-టెస్ట్‌కు ఆదేశిస్తామని పేపర్ లీకేజీపై విచారణ సందర్భంగా SC స్పష్టం చేసింది. ‘లీకైన పేపర్ వైరల్ చేశారని తెలిసినా మళ్లీ పరీక్ష నిర్వహించాలని చెబుతాం. ముందు పేపర్ ఎలా లీకైంది? ఎంతమందికి చేరింది? ఎలా చేరింది? లీకేజీతో లబ్ధిపొందిన విద్యార్థులపై ఎటువంటి చర్యలు తీసుకున్నారనే ప్రశ్నలకు సమాధానాలు కావాలి’ అని వ్యాఖ్యానించింది.

News July 8, 2024

ఎంతో ముఖ్యమైన క్యాచ్ 8 ఏళ్ల క్రితమే పట్టేశా: SKY

image

సూర్యకుమార్ యాదవ్ ఇన్‌స్టాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. టీ20 WC విన్నింగ్ క్యాచ్‌ను తన వైఫ్‌తో పోల్చారు. ‘స్టన్నింగ్ క్యాచ్ పట్టి నిన్నటికి 8 రోజులవుతోంది. కానీ అత్యంత ముఖ్యమైన క్యాచ్‌ను నిజానికి నేను 8 ఏళ్ల క్రితమే పట్టేశాను’ అని పేర్కొన్నారు. తన భార్య దేవిషా శెట్టి పరిచయమై 8 ఏళ్లవుతోందని ఇలా చెప్పుకొచ్చారు. కాగా T20 WC-2024 ఫైనల్స్‌లో చివరి ఓవర్‌లో SKY అద్భుత క్యాచ్ పట్టిన సంగతి తెలిసిందే.