News February 25, 2025
విశాఖలో ఆర్డీవోకు చుక్కెదురు

విశాఖలోని ఓ దినపత్రికపై మీద ఎదురుదాడి చేసిన అధికార యంత్రాంగానికి హైకోర్టులో చుక్కెదురైంది. లీడర్ దినపత్రిక సంపాదకులు రమణ మూర్తికి ఆర్డీవో శ్రీలేఖ ఇచ్చిన నోటీసులను హైకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిన న్యాయమూర్తి నిమ్మగడ్డ వెంకటేశ్వర రావు అలాగే ఆర్డీవో ఇచ్చిన నోటిస్పై 3 వారాలులోగా పూర్తి వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.
Similar News
News February 25, 2025
ఎమ్మెల్సీ అభ్యర్థులతో విశాఖ కలెక్టర్ సమావేశం

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అభ్యర్థులు పూర్తి సహాయ సహకారాలు అందించాలని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కోరారు. మంగళవారం మధ్యాహ్నం ప్రచార ప్రక్రియ గడువు ముగిసిన వెంటనే పోటీలో ఉన్న అభ్యర్థులు అనుసరించవలసిన విధానాలపై వారికి వివరించారు. పోలింగ్, కౌంటింగ్ ఏజెంట్లుపై పలు సూచనలు చేశారు.
News February 25, 2025
విశాఖ: 123 పోలింగ్ కేంద్రాలు.. 22,493 మంది ఓటర్లు

ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు ఎన్నికల అధికారి హరేంద్ర ప్రసాద్ తెలిపారు. 123 పోలింగ్ కేంద్రాలలో 22,493 మంది టీచర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారని వెల్లడించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా 144 సెక్షన్ విధిస్తామన్నారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు 739 మంది అధికారులను, సిబ్బందిని కేటాయించామన్నారు. 148 మంది పీవోలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
News February 25, 2025
విశాఖలో మూతపడిన మద్యం షాపులు

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో 48 గంటల పాటు మద్యం విక్రయాలను నిలిపేస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో విశాఖలో మద్యం దుకాణాలు మూతపడ్డాయి. మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు ఎక్సైజ్ అధికారులు ప్రతి మద్యం దుకాణం వద్దకు చేరుకొని సీల్డ్ వేసి తాళాలు స్వాధీనం చేసుకున్నారు. విశాఖలో మళ్లీ 27 సాయంత్రం 4 గంటల తర్వాత మద్యం షాపులు తెరుచుకుంటాయని అధికారులు తెలిపారు.