News February 25, 2025
లిక్కర్ పాలసీతో రూ.2వేల కోట్ల నష్టం: ఢిల్లీ సీఎం

ఆప్ సర్కార్ 2021-22లో తెచ్చిన లిక్కర్ పాలసీ కారణంగా ఢిల్లీ ప్రభుత్వానికి రూ.2వేల కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు కాగ్ నివేదిక వెల్లడించిందని సీఎం రేఖా గుప్తా తెలిపారు. లిక్కర్ వ్యాపారాన్ని సులభతరం చేయడం, ఏకఛత్రాధిపత్యాన్ని అడ్డుకోవడం కోసం తెచ్చిన ఈ విధానం దాని లక్ష్యాలను అందుకోలేకపోయిందని పేర్కొన్నారు. లైసెన్సుల జారీలో నిబంధనలను ఉల్లంఘించారని, నిపుణుల అభిప్రాయాలు తీసుకోలేదని వివరించారు.
Similar News
News February 13, 2026
వేములవాడ: కాంగ్రెస్ గూటికి బీఆర్ఎస్ కౌన్సిలర్..?

వేములవాడ మున్సిపల్ ఎన్నికల రాజకీయంలో సంచలనం చోటుచేసుకుంది. కారు గుర్తుపై గెలిచిన ఓ సీనియర్ నాయకుడు కాంగ్రెస్ గూటికి చేరినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. 28 వార్డులకు గాను కాంగ్రెస్ 13 స్థానాలు గెలవడంతో ఛైర్మన్ ఎన్నికకు అవసరమైన బల సమీకరణపై కాంగ్రెస్ దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఓ బీఆర్ఎస్ కౌన్సిలర్, ఇద్దరు స్వతంత్ర కౌన్సిలర్లను కాంగ్రెస్ ఇప్పటికే తన శిబిరానికి తరలించినట్లు సమాచారం.
News February 13, 2026
మహాశివరాత్రి: ఉపవాసం పరమార్థం ఇదే!

నిజమైన ఉపవాసం అంటే కేవలం ఆహారాన్ని త్యజించడం కాదు. శివునికి సమీపంగా ఉండటం. చెడు ఆలోచనలు, మాటలు, పనులకు దూరంగా ఉంటూ అంతర్ముఖ శుద్ధి సాధించడమే అసలైన శివభక్తి. బాహ్య పూజల కంటే అహంకారాన్ని వీడి, పవిత్రమైన మనసుతో చేసే ఆరాధనే పరమశివునికి ప్రీతికరం. ఉపవాస దీక్ష ద్వారా ఇంద్రియ నిగ్రహాన్ని పొంది, శివతత్వాన్ని ఆకళింపు చేసుకోవడమే ఈ పర్వదినం వెనుక ఉన్న పరమార్థం. మనసుని శివమయం చేయడమే ముక్తికి మార్గం.
News February 13, 2026
దూడల్లో విటమిన్-A లోపం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి?

విటమిన్-A లోపం ఉన్న దూడల్లో మెడ విరుపు, ఎదుగుదల సమస్యలు, విరేచనాలు, కళ్లు ఉబ్బడం, చూపు లేకపోవడం వంటి సమస్యలు కనిపిస్తాయి. పుట్టుకతోనే దూడల్లో ఈ సమస్యలు రాకుండా ఉండటానికి పశువు చూడుతో ఉన్నప్పుడు చివరి 3 నెలలు విటమిన్-A ఇంజెక్షన్ వెటర్నరీ నిపుణుల సూచనలతో అందించాలి. ఈనిన తర్వాత దూడలకు జున్ను పాలు సమృద్ధిగా తాగించాలి. దూడ పుట్టిన తర్వాత 1, 2వ వారం 2ML చొప్పున విటమిన్-A ఇంజెక్షన్ ఇవ్వాలి.


