News February 25, 2025

దుద్యాల్: లగచర్ల రైతులు ఇండస్ట్రియల్ పార్కుకు సహకరిస్తున్నారు: కలెక్టర్

image

లగచర్ల రైతులు స్వచ్ఛందంగా ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణానికి సహకరిస్తున్నారని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ ప్రతీక్ జైన్ దుద్యాల మండలం లగచర్ల ఇండస్ట్రియల్‌కు సంబంధించి తమ భూమి స్వచ్ఛందంగా ఇచ్చిన 22 మంది రైతులకు చెక్కులు పంపిణి చేశారు. భూములు ఇస్తున్న రైతులకు నష్టపరిహారాలు అందించి ప్రభుత్వం తరఫున ప్రోత్సహిస్తామని ఆయన తెలిపారు.

Similar News

News February 25, 2025

ఏడాదికి 2 సార్లు టెన్త్ ఎగ్జామ్స్: CBSE

image

సీబీఎస్ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 2026 నుంచి ఏడాదికి రెండుసార్లు టెన్త్ పరీక్షలు నిర్వహించనుంది. ఫిబ్రవరి 17-మార్చి 6 మధ్య తొలి దశ, మే 5-20 మధ్య రెండో దశ పరీక్షలు ఉండనున్నాయి. దీనికి సంబంధించిన ముసాయిదా నిబంధనలకు CBSE ఆమోదం తెలిపింది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఈ అంశంపై ఇప్పటికే ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది.

News February 25, 2025

గుర్రంపోడు తహశీల్దార్ సస్పెండ్

image

విధుల పట్ల నిర్లక్ష్యం వహించడమే కాకుండా, జిల్లా యంత్రాంగం ఆదేశాలను బేఖాతరు చేసినందుకుగాను సెలవులో ఉన్న గుర్రంపోడు తహశీల్దార్ జి.కిరణ్ కుమార్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనకు గత నెల 6 నుంచి 16 వరకు కలెక్టర్ సెలవులు మంజూరు చేశారు. గడువు దాటినా విధుల్లో చేరకపోవడంతో సస్పెండ్ చేశారు.

News February 25, 2025

శ్రీసత్యసాయి జిల్లా TODAY TOP NEWS

image

➢ వైసీపీ నుంచి అనంతపురం జిల్లా నేత బహిష్కరణ
➢ అనంతపురంలో ఐదుగురికి జీవిత ఖైదు
➢ తాడిపత్రిలో సినీ నటి మాధవీలతపై కేసు నమోదు
➢ లేపాక్షి మండలంలో యువకుడు ఆత్మహత్య
➢ హిందూపురం మాజీ ఎమ్మెల్యే సతీమణి మృతి
➢ చిలకం మధుసూదన్ రెడ్డికి కీలక బాధ్యతలు
➢ లేపాక్షిలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
➢ ధర్మవరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

error: Content is protected !!