News February 25, 2025
SLBC ఘటనపై త్వరలో పూర్తి స్థాయి విచారణ: మంత్రి ఉత్తమ్

TG: SLBC టన్నెల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తెచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ ఘటనపై త్వరలో పూర్తి స్థాయి విచారణ జరిపిస్తామన్నారు. అనుకోకుండా జరిగిన ఘటనపై ప్రతిపక్షాలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. కాగా టన్నెల్ 14kms వద్ద ప్రమాదం జరగగా, రెస్క్యూ బృందాలు 13.7kms వరకు చేరుకున్నాయి. సహాయ చర్యలు కొనసాగిస్తున్నాయి.
Similar News
News November 12, 2025
తగ్గిన బంగారం ధర.. పెరిగిన సిల్వర్ రేట్

గత రెండు రోజులు పెరిగిన గోల్డ్ రేట్స్ ఇవాళ కాస్త తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.330 తగ్గి రూ.1,25,510కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.300 దిగివచ్చి రూ.1,15,050గా నమోదైంది. అటు వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. కేజీ సిల్వర్ రేట్ రూ.3వేలు పెరిగి రూ.1,73,000కు చేరింది.
News November 12, 2025
హీరోగా మారిన డైరెక్టర్.. రూ.30 కోట్ల రెమ్యునరేషన్?

<<18171965>>హీరో అవతారమెత్తిన<<>> కోలీవుడ్ క్రేజీ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ సరికొత్త ఘనత సాధించినట్లు టాక్. దర్శకుడిగా ₹50Cr రెమ్యునరేషన్ తీసుకున్న ఆయన.. కథానాయకుడిగా తొలి మూవీకే ₹30Cr వరకు అందుకుంటున్నట్లు సమాచారం. ఇదొక రికార్డని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. లోకేశ్ ప్రధాన పాత్రలో ‘DC’ చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. కాగా ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో, కూలీ చిత్రాలతో ఆయన స్టార్ డైరెక్టర్గా ఎదిగిన విషయం తెలిసిందే.
News November 12, 2025
భీష్ముడిని, ధర్మరాజు ఏం అడిగాడంటే?

కో ధర్మ స్సర్వధర్మాణాం భవతః పరమో మతః|
కిం జపన్ ముచ్యతే జంతుః జన్మసంసారబంధనాత్||
భావం: అన్ని ధర్మాలలో ఉత్తమ ధర్మం ఏది? దేనిని జపిస్తే జీవులు జన్మ సంసార బంధనాల నుంచి విముక్తి పొందుతారు? అని ధర్మరాజు, భీష్ముడిని అడిగారు. మోక్ష సాధన మార్గాన్ని, సర్వ శ్రేయస్సుకు దారితీసే ఏకైక మార్గాన్ని తెలుసుకోవాలనే ధర్మరాజు జ్ఞాన జిజ్ఞాస ఈ ప్రశ్నలలో వ్యక్తమవుతోంది. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>


