News February 25, 2025

మహబూబాబాద్: ఈనెల 27న ఉపాధ్యాయులకు సెలవు 

image

ఈనెల 27న జరిగే వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధ్యాయులకు ప్రత్యేక సాధారణ సెలవు వర్తిస్తుందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నమోదిత ఓటర్లుగా ఉన్నవారు తమ ఓటు వినియోగించుకునేందుకు ఈ ప్రత్యేక సెలవు వర్తిస్తుందని తెలిపారు.

Similar News

News February 26, 2025

పౌర సరఫరాల జిల్లా మేనేజర్‌గా అంబదాస్ రాజేశ్వర్

image

సంగారెడ్డి జిల్లా పౌర సరఫరాల మేనేజర్‌గా అంబదాస్ రాజేశ్వర్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. నిజామాబాద్ జిల్లా మేనేజర్‌గా పనిచేస్తున్న ఆయన బదిలీపై సంగారెడ్డికి వచ్చారు. గతంలో ఆయన నారాయణఖేడ్ రెవెన్యూ డివిజనల్ మొదటి అధికారిగా పనిచేశారు. ఇకనుంచి సంగారెడ్డి పౌర సరఫరాల మేనేజర్‌గా పూర్తి బాధ్యతలు వహించనున్నారు.

News February 26, 2025

చికెన్ లెగ్‌పీస్ తిన్న బాపట్ల జిల్లా కలెక్టర్

image

బర్డ్ ఫ్లూ నేపథ్యంలో బాపట్ల జిల్లా వ్యాప్తంగా చికెన్ తినేందుకు ప్రజలు ఇప్పటికీ జంకుతున్నారు. చికెన్‌పై అపోహలు వద్దని చికెన్ తినొచ్చని అనేక చోట్ల అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ప్రజల్లో ఒకింత భయం నెలకొంది. ఈ నేపథ్యంలో బాపట్ల జిల్లా కలెక్టర్ ఒక అడుగు ముందుకేసి ప్రజల భయం పోగొట్టేలా చికెన్‌తో తయారు చేసిన ఆహారం తింటూ కనిపించారు. దీంతో ఇకనైనా ప్రజలు భయాన్ని వీడి చికెన్ తినాలని ఆకాంక్షించారు.

News February 26, 2025

గ్రామాల్లో మహిళా పోలీసులు ఇంటింటా అవగాహన కల్పించాలి: ఎస్పీ

image

గ్రామాల్లో సచివాలయ మహిళా పోలీసులు ఇంటింటికీ వెళ్లి సైబర్ నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు వివరించాలని ఎస్పీ జగదీశ్ ఆదేశించారు. అనంతపురం జేఎన్టీయూ ఆడిటోరియంలో మహిళా పోలీసులకు వర్క్‌షాప్ నిర్వహించారు. అందరూ గ్రామాల్లో తప్పనిసరిగా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ముఖ్యంగా మహిళలకు సెల్ ఫోన్, మొబైల్ యాప్స్ ద్వారా జరిగే నష్టాలను వివరించాలన్నారు.

error: Content is protected !!