News February 25, 2025
గుండాల కోనలో శివరాత్రి ఉత్సవాలు నిలిపివేత

ఓబులవారిపల్లి మండలం వై. కోట గ్రామం నుంచి రిజర్వు ఫారెస్ట్లో గల గుండాల కోనలో శివరాత్రి ఉత్సవాలను అర్ధాంతరంగా నిలిపివేసినట్లు తహశీల్దార్ శ్రీధర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున ఏనుగుల గుంపు తొక్కిసలాటలో ముగ్గురు వ్యక్తులు చనిపోగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దారి తప్పిన ఏనుగుల గుంపు ప్రమాదం కలుగజేస్తాయని ముందు జాగ్రత్తగా ఉత్సవాలను నిలిపివేసినట్లు తెలిపారు.
Similar News
News February 26, 2025
పశ్చిమగోదావరిలో TODAY TOP HEADLINES

✷ ప.గో జిల్లా రెండు రోజులపాటు జిల్లాలో వైన్ షాపుల బంద్
✷ జిల్లాలో మొదలైన శివరాత్రి ఉత్సవాలు
✷ ఉత్సవ ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ
✷ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సెలవు ప్రకటించిన కలెక్టర్
✷ మొగల్తూరులో చోరీ కేసులో నిందితుడికి జైలు శిక్ష
✷ నర్సాపురం శివరాత్రి ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ
News February 26, 2025
నాలుగు కాళ్లతో 17 ఏళ్ల బాలుడు.. సర్జరీ చేసిన AIIMS వైద్యులు

ఢిల్లీ AIIMS వైద్యులు అరుదైన ఆపరేషన్ చేశారు. నాలుగు కాళ్లతో జన్మించి 17 ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్న UPకి చెందిన బాలుడికి కొత్త జీవితం ఇచ్చారు. పొట్టపై ఉన్న రెండు కాళ్లను విజయవంతంగా తొలగించారు. తల్లి కడుపులో కవలలు సంపూర్ణంగా ఎదగకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి వస్తుందని డాక్టర్లు తెలిపారు. కోటి మందిలో ఒకరికి ఇలా జరుగుతుందని, ప్రపంచవ్యాప్తంగా 42 కేసులు మాత్రమే నమోదయ్యాయని చెప్పారు.
News February 26, 2025
శతశాతం ఈ-పంట నమోదు చేయాలి: కలెక్టర్

జిల్లాలో శత శాతం ఈ-పంట నందు నమోదు చేయాలని అనకాపల్లి కలెక్టర్ విజయ కృష్ణన్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టరు కార్యాలయ సమావేశం మందిరంలో వ్యవసాయశాఖకు సంబంధించి ఈ-పంట నమోదుపై మండలాల వారీగా మంగళవారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 32వేల ఎకరాలకు సంబంధించి 84 శాతం నమోదు పూర్తయిందన్నారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి శతశాతం పూర్తిచేయాలని సూచించారు.