News February 25, 2025

FLASH: నర్సంపేట: చింత చెట్టు కూలి ఒకరి మృతి

image

వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మాదన్నపేట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. మాదన్నపేట గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన సుంచు రవిపై మంగళవారం చింత చెట్టు కూలింది. తీవ్ర గాయాల పాలైన రవి అక్కడికక్కడే మృతిచెందాడు. రవికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 26, 2025

నర్సంపేట: తండ్రి సంవత్సరికం మరుసటి రోజే కొడుకు మృతి

image

తండ్రి సంవత్సరికం మరుసటి రోజే కొడుకు మృతిచెందిన ఘటన వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముగ్దుపురంలో చోటుచేసుకుంది. చింతకాయల రాజశేఖర్ ఆర్థిక, అనారోగ్య సమస్యలతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజశేఖర్ తండ్రి మల్లయ్య ఏడాది క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. మల్లయ్య సంవత్సరికం రోజే రాజశేఖర్ పురుగుల మందు తాగాడు. చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతిచెందగా, స్థానికులు నివాళులర్పించారు.

News February 26, 2025

వరంగల్: రైతన్నలు సిద్ధంగా ఉన్నారు: మాజీ MLA

image

రైతన్నకు మద్దతు ధర ఇవ్వకుండా రైతన్న కడుపు కొడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అదే రైతన్నలు గద్దే దించడానికి సిద్ధంగా ఉన్నారని మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. మిర్చి పంట ధరలు పడిపోయి రైతన్నలు ఆందోళన చెందుతున్నారన్నారు. వారికి సంఘీభావంగా బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నాయకులు అందరూ కలిసి ఎనుమముల మార్కెట్‌ను సందర్శించి రైతన్నల కష్టాలను అడిగి తెలుసుకున్నామన్నారు.

News February 26, 2025

వరంగల్: లేఅవుట్ అనుమతుల కోసం కమిటీ సమావేశం

image

వరంగల్ జిల్లాలో లేఅవుట్ అనుమతుల కోసం కలెక్టర్ సత్య శారద అధ్యక్షతన లేఅవుట్ కమిటీ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. వరంగల్ జిల్లా, జీడబ్ల్యూఎంసీ, నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో రెండు లేఅవుట్ల కోసం ప్రతిపాదనలు కాగా వాటిని కమిటీ నిబంధనలను అనుసరించి పరిశీలించి చర్చించి అనుమతి మంజూరు చేసింది. కమిషనర్ అశ్విని తానాజీ వాకాడే, అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, డీపీ సీపీ జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!