News February 25, 2025

ఒంగోలు: ‘రీ సర్వేపై ప్రత్యేక దృష్టి సారించాలి’ 

image

రాజధాని అమరావతి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో సీసీఎల్ఏ జయలక్ష్మి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంగళవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ పాల్గొన్నారు. ప్రభుత్వ భూములన్నింటికీ పూర్తిస్థాయిలో గుర్తించటానికి రీ సర్వే చేయాలని జయలక్ష్మి ఆదేశించారు. రీ సర్వే చేస్తున్న సిబ్బంది సకాలంలో హాజరయ్యేలా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.

Similar News

News April 23, 2025

FLASH: ఒంగోలు మాజీ MLAకు గుండెపోటు

image

ఒంగోలులో నిన్న రాత్రి టీడీపీ నేత, నాగులుప్పలపాడు మాజీ MPP ముప్పవరపు వీరయ్య చౌదరిని హత్య చేసిన విషయం తెలిసిందే. ఒంగోలు మాజీ MLA ఈదర హరిబాబుకు వీరయ్య చౌదరి మేనల్లుడు అవుతాడు. అల్లుడి మృతి వార్తతో హరిబాబు గుండెపోటుకు గురయ్యారు. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. మంత్రులు గొట్టిపాటి, స్వామి, ఎమ్మెల్యేలు దామచర్ల, విజయ్ కుమార్, ఉగ్ర నరసింహ రెడ్డి తదితరులు హరిబాబును పరామర్శించారు.

News April 23, 2025

ప్రకాశం జిల్లా 10వ తరగతి పరీక్షల సమాచారం

image

పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. ఇవాళ ఉదయం 10 గంటలకు మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ప్రకాశం జిల్లాలో 29,602 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరిగాయి.
☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

News April 22, 2025

యానాది కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వినతి

image

యానాదుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి చెప్పారు. టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలోని క్యాంపు కార్యాలయంలో యానాది సంఘం ప్రతినిధులు మంత్రిని కలిశారు. యానాది కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. ప్రిమిటివ్ ట్రైబల్ జాబితాలో తమను చేర్చాలని కోరారు. జనాభా దామాషా ప్రాతిపదికన చట్టసభల్లో యానాది సామాజిక వర్గానికి ప్రాధాన్యతివ్వాలని వినతిపత్రం అందజేశారు.

error: Content is protected !!