News February 25, 2025
HYD: జూ పార్క్లో టికెట్ ధరలు పెంపు

HYD బహదూర్పురాలోని నెహ్రూ జూలాజికల్ పార్క్ ఎంట్రీ టికెట్ ధర పెంచినట్లు క్యూరేటర్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. చిన్నారులకు రూ. 50, పెద్దలకు రూ. 100 చొప్పున టికెట్ ధరలు నిర్ణయించారు. పార్క్ లోపల సఫారీ, ట్రెయిన్ రైడ్, ఫిష్ ఆక్వేరియం వెళ్లే ధరలు కూడా పెరిగాయి. మార్చి 1వ తేదీ నుంచి ఇవి అమల్లోకి వస్తాయని క్యూరేటర్ స్పష్టం చేశారు.
Similar News
News December 29, 2025
రంగారెడ్డి జిల్లాలో మరోసారి ఎన్నికలు!

RRలో ఎన్నికల నగారా మోగనుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం మున్సిపల్ ఎన్నికలకు EC సమాయత్తం అవుతోంది. జిల్లాలో 6 మున్సిపాలిటీల్లో ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు నోటిఫికేషన్ వెల్లడైంది.
అమనగల్లు: వార్డులు 15, జనాభా 19,874
చేవెళ్ల: వార్డులు 18, జనాభా 22,713
ఇబ్రహీంపట్నం: వార్డులు 24, జనాభా 30,993
మొయినాబాద్: వార్డులు26, జనాభా 28,196
షాద్నగర్: వార్డులు 28, జనాభా 54,431
శంకర్పల్లి: వార్డులు 15, జనాభా 20,789
News December 23, 2025
RR: పాలకులు వచ్చారు.. మీ ఊరి సమస్యలపై కామెంట్!

రంగారెడ్డి జిల్లాల్లోని పల్లెల్లో కొత్త పాలకవర్గాలు సోమవారం ప్రమాణ స్వీకారం చేశాయి. దాదాపు రెండేళ్లుగా గ్రామాల్లో పాలన వ్యవస్థ సరిగా లేక రోడ్లు, డ్రైనేజీ, కోతుల బెడద, అసంపూర్తి భవనాలు, విద్యుత్, రెవెన్యూ ఇలా అనేక సమస్యలు తిష్ఠ వేశాయి. వాటి పరిష్కారానికి కొత్త పాలకులు కృషి చేయనున్నారు. మరి మీ గ్రామంలో నెలకొన్న సమస్యలపై కామెంట్ చేయండి.
News December 23, 2025
RR: పాలకులు వచ్చారు.. మీ ఊరి సమస్యలపై కామెంట్!

రంగారెడ్డి జిల్లాల్లోని పల్లెల్లో కొత్త పాలకవర్గాలు సోమవారం ప్రమాణ స్వీకారం చేశాయి. దాదాపు రెండేళ్లుగా గ్రామాల్లో పాలన వ్యవస్థ సరిగా లేక రోడ్లు, డ్రైనేజీ, కోతుల బెడద, అసంపూర్తి భవనాలు, విద్యుత్, రెవెన్యూ ఇలా అనేక సమస్యలు తిష్ఠ వేశాయి. వాటి పరిష్కారానికి కొత్త పాలకులు కృషి చేయనున్నారు. మరి మీ గ్రామంలో నెలకొన్న సమస్యలపై కామెంట్ చేయండి.


