News March 21, 2024
ఖమ్మం: కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటనపై హై టెన్షన్

ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటనపై హై టెన్షన్ నెలకొంది. రాష్ట్ర రాజకీయాల్లో ఖమ్మం జిల్లాకు ప్రత్యేక చరిత్ర కలదు. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఖమ్మంకు కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటనపై సస్పెన్స్ సాగుతోంది. BRSతరఫున నామా, BJPతరఫున జలగం బరిలో ఉండగా కాంగ్రెస్లో నందిని,యుగేందర్,ప్రసాద్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థి అభ్యర్థి ఖరారు కాగా అలకలు లేకుండా చేసి ప్రకటన చేయాలనీ అధిష్టానం భావిస్తుంది.
Similar News
News December 30, 2025
ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలపై బ్యాంకర్లు దృష్టి సారించాలి: అ. కలెక్టర్

ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల విజయవంతానికి బ్యాంకర్లు దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి సూచించారు. కలెక్టరేట్లో డీసీసీ, డీఎల్ఆర్సీ సమావేశంలో మాట్లాడారు. రెండో త్రైమాసికం ముగిసే నాటికి జిల్లాలో ప్రాధాన్యత రంగం కింద నిర్దేశించుకున్న రుణ పంపిణీ లక్ష్యంలో 54.15 శాతం పూర్తి చేసినట్లు వెల్లడించారు. మిగిలిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని కోరారు.
News December 30, 2025
ఖమ్మం: తగ్గిన నేరాలు.. బాధితులకు రూ.7 కోట్లు వాపస్!

ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాలు భారీగా తగ్గాయని సీపీ సునీల్ దత్ తెలిపారు. పోలీసుల సమష్టి కృషితో దోపిడీలు, దొంగతనాలు, హత్యలు కట్టడి అయ్యాయన్నారు. ఇప్పటివరకు రూ.2.45 కోట్ల చోరీ సొత్తును రికవరీ చేశామన్నారు. సైబర్ నేరగాళ్లు దోచుకున్న రూ.4.5 కోట్లను బాధితుల ఖాతాల్లో జమ చేయించామని, మరో రూ.1.5 కోట్లు హోల్డ్ చేశామని తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా 36,709 కేసులు పరిష్కరించినట్లు చెప్పారు.
News December 30, 2025
ఖమ్మం: తగ్గిన నేరాలు.. బాధితులకు రూ.7 కోట్లు వాపస్!

ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాలు భారీగా తగ్గాయని సీపీ సునీల్ దత్ తెలిపారు. పోలీసుల సమష్టి కృషితో దోపిడీలు, దొంగతనాలు, హత్యలు కట్టడి అయ్యాయన్నారు. ఇప్పటివరకు రూ.2.45 కోట్ల చోరీ సొత్తును రికవరీ చేశామన్నారు. సైబర్ నేరగాళ్లు దోచుకున్న రూ.4.5 కోట్లను బాధితుల ఖాతాల్లో జమ చేయించామని, మరో రూ.1.5 కోట్లు హోల్డ్ చేశామని తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా 36,709 కేసులు పరిష్కరించినట్లు చెప్పారు.


