News February 25, 2025
విద్యార్థుల కోసం చివరి క్షణాల్లోనూ..!

ఉపాధ్యాయులకు విద్యార్థులే జీవితం. వారి భవిష్యత్తు కోసం చదువు చెప్తూ, ఒక్కోసారి దండిస్తూ తన జీవితాన్నే త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉంటారు. అలాంటి ఓ ఉపాధ్యాయుడు చనిపోయే కొన్ని క్షణాల ముందు విద్యార్థుల కోసం ఆస్పత్రి బెడ్పై ల్యాప్టాప్ పట్టుకొని పనిచేశారు. దీనికి సంబంధించిన ఫొటోను ఉపాధ్యాయుడి కుమార్తె షేర్ చేయగా వైరలవుతోంది. విద్యార్థుల చదువు పట్ల అతని అంకితభావాన్ని అభినందించాల్సిందే.
Similar News
News February 26, 2025
ఆత్మహత్యల ‘కోటా’.. అడ్డుకట్టకు చర్యలు!

రాజస్థాన్లోని కోటాలో ఎన్ని చర్యలు చేపట్టినా విద్యార్థుల ఆత్మహత్యలకు <<14028051>>అడ్డుకట్ట<<>> పడటంలేదు. స్థానిక అధికారులు తాజాగా మరికొన్ని మార్గదర్శకాలను అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. గతంలో హాస్టల్ యజమానులు ఏడాది మొత్తం ఫీజును ఒకేసారి వసూలు చేసేవారు. ఇకపై తొలుత రూ.2వేలు మాత్రమే తీసుకోవాలని నిబంధన విధించారు. విద్యార్థులు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు పార్క్లు, క్రీడా మైదానాలు ఏర్పాటు చేయనున్నారు.
News February 26, 2025
నేనైనా లింగ వివక్షను ఎదుర్కోవాల్సిందే: జ్యోతిక

హీరో సూర్య భార్యగా తానూ లింగ వివక్షను ఎదుర్కొంటున్నట్లు నటి జ్యోతిక చెప్పారు. ‘సూర్యని పెళ్లి చేసుకున్నందుకు నేను అదృష్టవంతురాలినని ఏదైనా ఇంటర్వ్యూలో చెబితే ప్రజలు అతడు మంచివాడని అంటారు. నన్ను పెళ్లి చేసుకొని సూర్య సంతోషంగా ఉన్నాడని చెప్పినా అతడినే పొగుడుతారు. ఇందులో నేనెక్కడా కనిపించను. ఎందుకంటే సమాజం అలా చిత్రీకరిస్తుంది’ అని తాను నటించిన ‘డబ్బా కార్టెల్’ వెబ్ సిరీస్ ప్రమోషన్లో తెలిపారు.
News February 26, 2025
మహా శివరాత్రితో మహా కుంభమేళాకు తెర

ప్రపంచంలోనే అతిపెద్ద వేడుక మహాకుంభ మేళా నేటితో ముగియనుంది. మహా శివరాత్రి పర్వదినంతో ఈ మహత్తర కార్యక్రమానికి తెరపడనుంది. జనవరి 13న ప్రారంభమైన కుంభమేళాకు దేశవిదేశాల నుంచి భక్తులు తరలివచ్చారు. త్రివేణీ సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఇప్పటివరకు 65 కోట్ల మంది స్నానాలు ఆచరించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. చివరి రోజైన ఇవాళ 2 కోట్ల మంది రానున్నట్లు అంచనా.