News February 25, 2025
కృష్ణా జిల్లా: TODAY TOP NEWS

* జిల్లావ్యాప్తంగా మూతపడ్డ మద్యం దుకాణాలు * MLC ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్ * వల్లభనేని వంశీకి ముగిసిన విచారణ.. జైలుకు తరలింపు * గన్నవరంలో ఆటో బోల్తా.. వ్యక్తి మృతి * VJA: మసాజ్ సెంటర్పై కేసు.. చర్యలకు రంగం సిద్ధం * కృష్ణా: MLC ఎన్నికలు.. పరీక్షల వాయిదా * ఉంగుటూరు: వివాహితను వేధించిన వ్యక్తికి రిమాండ్ * 27న GOVT ఉద్యోగులకు Special క్యాజువల్ లీవ్: కలెక్టర్
Similar News
News July 9, 2025
మచిలీపట్నం: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మచిలీపట్నం చిలకలపూడిలో కొనసాగుతున్న మైనార్టీ గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధిత శాఖాధికారులు చర్యలు చేపట్టారు. PGT, ఇంగ్లిష్, ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండగా సంబంధిత పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అర్హత, ఆసక్తి గల వారు తమ దరఖాస్తులను పాఠశాల పని వేళలలో అందజేయాలని ప్రిన్సిపల్ బేతపూడి రవి కోరారు.
News July 9, 2025
కృష్ణా: రేపే మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్

విద్యార్థుల అభ్యాసాన్ని, అభివృద్ధిని సమీక్షించేందుకు ప్రభుత్వం చేపట్టిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ గురువారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 1,798 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో జరిగే ఈ సమావేశంలో 2,65,574 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొననున్నారు. కార్యక్రమంలో భాగంగా అధికారులు పాఠశాలల వద్ద తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
News July 9, 2025
కృష్ణా: ఉచిత బస్సుపై ఆ ప్రాంతాల ప్రజలకు నిరాశ.!

పెనమలూరు, గన్నవరం మండలాలవారు నిత్యం విజయవాడ నగరానికి ఉద్యోగాలు, విద్య, ఇతర అవసరాల కోసం ప్రయాణిస్తుంటారు. అయితే సీఎం చంద్రబాబు ప్రకటించిన ఉచిత బస్సు ప్రయాణం జిల్లాకే పరిమితం అన్న స్పష్టతతో ఆ ప్రయాణికుల్లో అసంతృప్తి నెలకొంది. కానీ ఈ మండలాల నుంచి విజయవాడ కూతవేటు దూరంలో ఉన్నా ఉచిత ప్రయాణం వర్తించకపోవడం విద్యార్థులు, ఉద్యోగులకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తోంది. దీనిపై మీ కామెంట్.!