News February 26, 2025
పోగొట్టుకున్న ఫోన్లను బాధితులకు అందించిన ఎస్పీ

భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు CEIR పోర్టల్ ద్వారా రికవరీ చేసి వారికి అందజేశామని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. గత 2 నెలల వ్యవధిలో మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న 170 మంది భాదితులకు ఈ రోజు జిల్లా ఎస్పీ కార్యాలయంలో అప్పగించడం జరిగిందన్నారు. మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న బాధితులు వెంటనే CEIR పోర్టల్లో నమోదు చేసుకోవాలని సూచించారు.
Similar News
News July 5, 2025
ఎన్టీఆర్: నకిలీ సర్టిఫికెట్ల కలకలం

ఎన్టీఆర్ జిల్లాకు చెందిన పలువురు ఏఎన్ఎంలు ప్రమోషన్ల కోసం నకిలీ క్లినికల్ టెస్టింగ్ సర్టిఫికెట్లు సమర్పించారు. నరసరావుపేటలోని ఓ కాలేజీలో ఇంటర్న్షిప్ చేయకుండానే వీటిని పొందినట్లు వైద్యశాఖ గుర్తించింది. ఈ ఘటనపై కృష్ణా జిల్లా డీఎంహెచ్ఓ శర్మిష్ఠ ఏఎన్ఎంలకు నోటీసులు జారీ చేశారు. సదరు కాలేజీని సంప్రదించగా, ఈ సర్టిఫికెట్లు నకిలీవని తేలిందన్నారు.
News July 5, 2025
HYDలో అత్యధికంగా బియ్యం పంపిణీ

రాష్ట్రంలో మూడు నెలల సన్న బియ్యం పంపిణీ ముగిసింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మొత్తం 13,61,691 కార్డులు ఉండగా 14,25,303 మంది, HYDలో మొత్తం 6,47,282 కార్డులు ఉండగా 6,83,525 మంది బియ్యం తీసుకున్నారు. MDCLలో 112.66 శాతం, HYDలో 105.59 శాతం, RRలో 106.16 శాతం మంది బియ్యం తీసుకున్నారు. నగరంలో రేషన్ షాపులకు కేటాయించిన కార్డుల కంటే ఎక్కువ బియ్యం పంపిణీ జరిగింది. తిరిగి సెప్టెంబర్లో పంపిణీ చేయనున్నారు.
News July 5, 2025
మేడ్చల్లో అత్యధికంగా బియ్యం పంపిణీ

రాష్ట్రంలో మూడు నెలల సన్న బియ్యం పంపిణీ ముగిసింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మొత్తం 13,61,691 కార్డులు ఉండగా 14,25,303 మంది, HYDలో మొత్తం 6,47,282 కార్డులు ఉండగా 6,83,525 మంది బియ్యం తీసుకున్నారు. MDCLలో 112.66 శాతం, HYDలో 105.59 శాతం, RRలో 106.16 శాతం మంది బియ్యం తీసుకున్నారు. నగరంలో రేషన్ షాపులకు కేటాయించిన కార్డుల కంటే ఎక్కువ బియ్యం పంపిణీ జరిగింది. తిరిగి సెప్టెంబర్లో పంపిణీ చేయనున్నారు.