News February 26, 2025
ఎంఎస్ఎంఈ సర్వే వేగవంతం చేయండి: కలెక్టర్

అల్లూరి జిల్లాలో ఉన్న సూక్ష్మ, చిన్న తరహా సంస్థల సర్వే వేగంగా పూర్తిచేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను మంగళవారం ఆదేశించారు. జిల్లాలో 11,279 సూక్ష్మ చిన్న తరహా సంస్థలలో 4,608 సంస్థలను సర్వే చేసారని, మిగిలిన 6,671 సంస్థల సర్వే పూర్తిచేయాలన్నారు. MSME సర్వే సక్రమంగా చేయని MPDOలకు షోకాజ్ నోటీసులు జారీచేయాలని ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ CEOను ఆదేశించారు. మార్చి 8నుండి 18వరకు సర్వే జరుగుతుందన్నారు
Similar News
News January 10, 2026
‘అల్మాంట్-కిడ్’ సిరప్పై నిషేధం

బిహార్కు చెందిన ట్రైడస్ రెమెడీస్ కంపెనీ ‘అల్మాంట్-కిడ్’ సిరప్పై TG డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ నిషేధం విధించింది. చిన్నారులకు ఉపయోగించే ఈ సిరప్లో విషపూరితమైన ‘ఇథిలీన్ గ్లైకాల్’ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వినియోగం ప్రాణాంతకమంటూ ‘స్టాప్ యూజ్’ నోటీసు జారీ చేశారు. ‘ప్రజలు ఈ సిరప్ను వాడటం వెంటనే ఆపేయాలి. మీ దగ్గర ఈ మందు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1800-599-6969కు ఫిర్యాదు చేయాలి’ అని కోరారు.
News January 10, 2026
వచ్చే సీజన్లోనూ డెడ్ స్టోరేజీకి సింగూర్ !

సింగూరు జలాశయం ఆనకట్టతో పాటు ప్రాజెక్టుకు సంబంధించిన ఆఫ్రాన్ భాగాలు కూడా దెబ్బతిన్నాయి. తరచూ మొరాయించే గేట్ల మరమ్మతులు, రంగుల పూత పనులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సమస్యలన్నింటినీ సమగ్రంగా పరిష్కరించేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. వచ్చే సీజనులో ఈ మరమ్మతు, పునరుద్ధరణ పనులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. అందుకోసం ప్రాజెక్టు నీటిమట్టాన్ని డెడ్ స్టోరేజీ స్థాయికి తగ్గించనున్నారు.
News January 10, 2026
మహిళా ఆఫీసర్, మంత్రిపై ఆరోపణలు.. ఖండించిన IAS అసోసియేషన్

TG: మహిళా IASపై ఓ మంత్రి ఆపేక్ష చూపిస్తున్నారంటూ ఓ న్యూస్ ఛానల్ టెలికాస్ట్ చేయడాన్ని TG IAS ఆఫీసర్స్ అసోసియేషన్ ఖండించింది. మహిళా అధికారిపై నిరాధార ఆరోపణలు చేశారని మండిపడింది. దీనిని మహిళా ఆఫీసర్లు, సివిల్ సర్వీసెస్పై దాడిగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది. పబ్లిక్గా క్షమాపణలు చెప్పాలని ఆ సంస్థను డిమాండ్ చేసింది. ఇలాంటి దురుద్దేశపూర్వక కంటెంట్ను ప్రసారం చేయొద్దని మీడియా సంస్థలను హెచ్చరించింది.


