News February 26, 2025
KMR: పది పరీక్షలు..ఎంత మంది రాయనున్నారంటే..?

పది పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసే పనిలో ఉంది. KMR జిల్లాలో పది వార్షిక పరీక్షలు 12,579 మంది విద్యార్థులు రాయనున్నారు. ఇందు కోసం 64 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పర్యవేక్షణకు..ఐదుగురు రూట్, 22 మంది కస్టోడియన్స్, 22 జాయింట్ కస్టోడియన్స్, 11 మంది సీ సెంటర్ కస్టోడియన్స్, ముగ్గురు ఫ్లయింగ్ స్క్వాడ్, 12 సిట్టింగ్ స్క్వార్డ్, 698 మంది ఇన్విజిలేటర్లను నియమించింది.
Similar News
News February 26, 2025
తాళ్లపూడి: గల్లంతై చనిపోయింది వీరే..!

తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామం పండగ రోజు తీవ్ర విషాదంలో మునిగిపోయింది. నదీ స్నానానికి దిగిన 11 మందిలో ఐదుగురు గల్లంతై చనిపోయారు. మృతదేహాలను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెలికితీశాయి. 20 సంవత్సరాలు దాటకుండానే ఆ యువకులు చనిపోయారు. మృతదేహాల వద్ద వారి కుటుంబసభ్యులు రోదించిన తీరు అక్కడి వారిని కంటతడి పెట్టించింది. ఆల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారులు మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.
News February 26, 2025
కాంగోలో వింతవ్యాధి: సోకిన 48 గంటల్లోపే మరణం

కాంగో దేశాన్ని ఓ వింత వ్యాధి 5 వారాలుగా కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. జ్వరం, వాంతులు, అంతర్గత రక్తస్రావంతో ప్రజలు చచ్చిపోతున్నారు. ఈ లక్షణాలు ఎబోలా, డెంగ్యూ, మార్బర్గ్, యెల్లో ఫీవర్ను పోలివుండటంతో WHO సైతం ఆందోళన వ్యక్తం చేసింది. కొన్ని రోజుల క్రితం బొలొకొ గ్రామంలో గబ్బిలాలను తిన్న ముగ్గురు పిల్లలు 48 గంటల్లోపే చనిపోవడంతో ఔట్బ్రేక్ మొదలైంది. 419 మందికి సోకింది. 53 మందిని చంపేసింది.
News February 26, 2025
క్రికెటే నా ప్రాణం: రోహిత్ శర్మ

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్రికెట్ అంటే తనకు ప్రాణమని తాను బతికేదే ఆటకోసమని అన్నారు. ఛాంపియన్స్ ట్రోఫిలో ఇండియా సెమీస్ చేరటంపై రోహిత్ సంతోషం వ్యక్తం చేశారు. కోహ్లీ అంటే తనకెంతో ఇష్టమని.. ఇండియా విజయం కోసం అతను దేనికైనా సిద్ధంగా ఉంటాడని తెలిపారు. ప్రస్తుతం కప్పు గెలవటం పైనే తన పూర్తి ఫోకస్ ఉందని హిట్మ్యాన్ వివరించారు.