News February 26, 2025
నేటి నుంచి రంజీ ట్రోఫీ ఫైనల్

2024-25 సీజన్ రంజీ ట్రోఫీ ఫైనల్ నేటి నుంచి ప్రారంభం కానుంది. క్వార్టర్స్లో ఒకటి, సెమీస్లో 2 రన్స్ ఫస్ట్ ING లీడ్తో అనూహ్యంగా తొలిసారి ఫైనల్ చేరిన కేరళ, 2సార్లు టైటిల్ విన్నర్ విదర్భ జట్లు తుదిపోరులో తలపడనున్నాయి. అక్షయ్ వాడ్కర్(C), కరుణ్ నాయర్, మాలేవర్లతో విదర్భ బ్యాటింగ్ బలంగా ఉంది. అటు, సచిన్ బేబీ నేతృత్వంలోని కేరళ బ్యాటర్లు నిజార్, అజహరుద్దీన్, బౌలర్ జలజ్ సక్సేనాలపై ఆశలు పెట్టుకుంది.
Similar News
News February 26, 2025
కేసీఆర్కు కిషన్ రెడ్డి పార్ట్నర్: CM రేవంత్

TG: KCRకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్ట్నర్ అని CM రేవంత్ అన్నారు. ‘KCR కోసమే కిషన్ రెడ్డి పని చేస్తున్నారు. నాకు పేరొస్తుందని మెట్రో విస్తరణను అడ్డుకుంటున్నారు’ అని ఆరోపించారు. SLBC టన్నెల్ ప్రమాదంపై మాట్లాడుతూ ‘పదేళ్ల నుంచి పనులు చేయకపోవడం వల్లే ప్రమాదం జరిగింది. అంతకుముందు కాంగ్రెస్ హయాంలో 30కి.మీ మేర టన్నెల్ పూర్తయింది. తర్వాత తనకు లాభాలు రావడం లేదని KCR పనులను ఆపేశారు’ అని పేర్కొన్నారు.
News February 26, 2025
సినీ నిర్మాత మృతి.. సీఎం సంచలన వ్యాఖ్యలు

TG: సినీ నిర్మాత కేదార్ <<15577363>>మృతిని<<>> KTRకు ముడిపెడుతూ CM రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతకాలంగా పలువురు అనుమానాస్పద స్థితిలో చనిపోతున్నారని సందేహం వ్యక్తం చేశారు. ముందు సంజీవరెడ్డి, ఆ తర్వాత రాజలింగ మూర్తి, KTR సన్నిహితుడు కేదార్ చనిపోయారని తెలిపారు. ఈ మిస్టీరియస్ మరణాలపై ఆయన ఎందుకు స్పందించలేదని, విచారణ ఎందుకు కోరలేదని ప్రశ్నించారు. కేదార్ డ్రగ్స్ కేసులో నిందితుడని మీడియాతో చిట్చాట్లో తెలిపారు.
News February 26, 2025
SLBC TUNNEL: రంగంలోకి BSF నిపుణులు

TG: SLBC టన్నెల్ వద్ద సహాయక చర్యలు శరవేగంగా కొనసాగుతున్నాయి. BSF టన్నెల్ వర్క్స్ నిపుణులను రాష్ట్ర ప్రభుత్వం రప్పించింది. ప్రస్తుతం వారు అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. టీబీఎం చేరే దారి కోసం వారు వెతుకుతున్నారు. సహాయక చర్యలకు ప్రధాన ఆటంకంగా ఉన్న బురదను తొలగించేందుకు నిపుణులు సిద్ధమయ్యారు. మరోవైపు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్కుమార్ రెడ్డి నిపుణులతో సమీక్ష జరిపారు.