News February 26, 2025

వేంపాడులో లారీ ఢీకొని కాకినాడ జిల్లా వాసి మృతి

image

నక్కపల్లి మండలం వేంపాడు టోల్ ప్లాజా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందినట్లు ఎస్సై సన్నిబాబు మంగళవారం తెలిపారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలుకు చెందిన చిక్కాల శ్యాంప్రసాద్ (29) వేంపాడు వద్ద ఫ్యాబ్రిక్స్ వర్క్స్ షాపులో పని చేస్తున్నాడు. స్నేహితుడితో కలిసి బైక్‌పై టోల్ ప్లాజా వద్ద టీపాయింట్‌కు వెళుతుండగా లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో శ్యాం ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు.

Similar News

News October 29, 2025

శంషాబాద్‌లో ఎయిర్‌పోర్టులో మొబైల్స్, ఈ-సిగరేట్స్ సీజ్

image

శంషాబాద్ విమానాశ్రయంలో అరైవల్ ర్యాంప్ వద్ద గుర్తుతెలియని యాష్ కలర్ హ్యాండ్‌బ్యాగ్ వదిలి వెళ్లారు. అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్ వెంటనే SOCCకి సమాచారం అందించింది. తక్షణమే BDDS బృందం ఘటనా స్థలానికి చేరుకుని, తనిఖీలు నిర్వహించి బ్యాగ్‌ సురక్షితమని ప్రకటించింది. బ్యాగ్‌‌లో మొబైల్ ఫోన్లు,ఈ- సిగరెట్లు లభించాయి. మొత్తం విలువ సుమారు ₹12.72 లక్షలని తెలిపారు. కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

News October 29, 2025

శంషాబాద్‌లో ఎయిర్‌పోర్టులో మొబైల్స్, ఈ-సిగరేట్స్ సీజ్

image

శంషాబాద్ విమానాశ్రయంలో అరైవల్ ర్యాంప్ వద్ద గుర్తుతెలియని యాష్ కలర్ హ్యాండ్‌బ్యాగ్ వదిలి వెళ్లారు. అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్ వెంటనే SOCCకి సమాచారం అందించింది. తక్షణమే BDDS బృందం ఘటనా స్థలానికి చేరుకుని, తనిఖీలు నిర్వహించి బ్యాగ్‌ సురక్షితమని ప్రకటించింది. బ్యాగ్‌‌లో మొబైల్ ఫోన్లు,ఈ- సిగరెట్లు లభించాయి. మొత్తం విలువ సుమారు ₹12.72 లక్షలని తెలిపారు. కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

News October 29, 2025

భువనగిరి: నేడు పాఠశాలలకు సెలవు

image

మొంథా ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండగా కలెక్టర్ హనుమంతరావు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఉదయం 8:48కి సెలవు ప్రకటన చేయగా అప్పటికే విద్యార్థులు, టీచర్లు స్కూళ్లకు వెళ్లారు. దీంతో అప్పటికే పాఠశాలలకు చేరుకున్న ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయుల నిర్ణయం మేరకు పాఠశాలను నడపాలని సూచించారు.