News February 26, 2025
వేంపాడులో లారీ ఢీకొని కాకినాడ జిల్లా వాసి మృతి

నక్కపల్లి మండలం వేంపాడు టోల్ ప్లాజా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందినట్లు ఎస్సై సన్నిబాబు మంగళవారం తెలిపారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలుకు చెందిన చిక్కాల శ్యాంప్రసాద్ (29) వేంపాడు వద్ద ఫ్యాబ్రిక్స్ వర్క్స్ షాపులో పని చేస్తున్నాడు. స్నేహితుడితో కలిసి బైక్పై టోల్ ప్లాజా వద్ద టీపాయింట్కు వెళుతుండగా లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో శ్యాం ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు.
Similar News
News January 5, 2026
US వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఇంటిపై కాల్పులు

అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఇంటిపై కాల్పులు జరగడం సంచలనంగా మారింది. ఒహియోలోని ఇంటిపై ఓ దుండగుడు కాల్పులు జరపడంతో అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఫైరింగ్ సమయంలో వాన్స్ ఇంట్లో లేరని అధికారులు వెల్లడించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్, పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News January 5, 2026
మహిళలూ 35ఏళ్లు దాటాయా?

35ఏళ్లు దాటిన తర్వాత మహిళల ఎముకల సాంద్రత తగ్గుతూ, ఎముకలు గుల్లబారడం మొదలవుతుంది. ఇదే ఆస్టియొపొరోసిస్. ఇలా కాకుండా ఉండాలంటే 35 ఏళ్ల వరకూ ప్రతిరోజూ పావు లీటరు పాలు, పాల ఉత్పత్తులు తీసుకుంటూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే మెనోపాజ్ వరకూ ఎముకల అరుగుదలను నియంత్రించవచ్చు. ఆ తర్వాత క్యాల్షియం సప్లిమెంట్ల అవసరం రావొచ్చు. అప్పుడు కూడా సొంతంగా సప్లిమెంట్లు కొనేసి వాడేయకుండా, వైద్యుల సూచనలను పాటించాలి.
News January 5, 2026
తిరుపతి: సంక్రాంతికి ధర.. రూ.10 వేలు పైనే.!

సంక్రాంతి నేపథ్యంలో తిరుపతిలో ట్రావెల్స్ యజమానులు ధరలను అమాంతం పెంచేశారు. సాధారణంగా HYD-TPT మధ్య బస్సు స్లీపర్ ధర రూ.వెయ్యి-1500 ఉంటుంది. 11,12,13 తేదీల్లో ధరలు రూ.2వేల పైమాటే. సంక్రాంతి దగ్గరకొచ్చే కొద్ది రూ.5వేలకు చేరిన ఆశ్చర్యం లేదు. మరోవైపు HYD-TPT మధ్య ఫ్లైట్ ధరలు నార్మల్ డేస్లో రూ.3700-4500 మధ్య ఉండగా 10వ తేదీ రూ.8-10వేల మధ్య ఉంటున్నాయి. దీంతో పండుక్కు వెళ్లకుండానే జేబులు ఖాళీ అవుతున్నాయట.


