News February 26, 2025
వేంపాడులో లారీ ఢీకొని కాకినాడ జిల్లా వాసి మృతి

నక్కపల్లి మండలం వేంపాడు టోల్ ప్లాజా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందినట్లు ఎస్సై సన్నిబాబు మంగళవారం తెలిపారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలుకు చెందిన చిక్కాల శ్యాంప్రసాద్ (29) వేంపాడు వద్ద ఫ్యాబ్రిక్స్ వర్క్స్ షాపులో పని చేస్తున్నాడు. స్నేహితుడితో కలిసి బైక్పై టోల్ ప్లాజా వద్ద టీపాయింట్కు వెళుతుండగా లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో శ్యాం ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు.
Similar News
News July 7, 2025
నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో ప్రవేశం కోసం 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. అర్హులైన విద్యార్థులు దరఖాస్తులను https://navodaya.gov.in వెబ్సైట్ ద్వారా ఈ నెల 29వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని చెప్పారు. ప్రవేశాలకు డిసంబర్ 13న పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
News July 7, 2025
GET READY: 7.03PMకి ‘కింగ్డమ్’ రిలీజ్ డేట్ ప్రోమో

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తోన్న ‘కింగ్డమ్’ సినిమా విడుదల తేదీ ప్రకటనపై మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్ర విడుదల తేదీతో కూడిన ప్రోమో వీడియోను రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇవాళ సాయంత్రం 7.03కి విడుదల చేయనున్నట్లు వెల్లడిస్తూ స్పెషల్ పోస్టర్ను షేర్ చేశారు. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తుండగా అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు.
News July 7, 2025
రాంపల్లిలో రోడ్డు ప్రమాదం.. తలమీద నుంచి వెళ్లిన లారీ

నాగారం మున్సిపాలిటీ పరిధిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాంపల్లిలోని వీఆర్ఆర్ ఫంక్షన్ హాల్ వద్ద లారీ కింద పడి వ్యక్తి దుర్మరణం చెందాడు. బైక్ మీద వస్తున్న వ్యక్తి స్కిడ్ అయి పడిపోవడంతో వెనుక నుంచి వస్తున్న లారీ ఆయన తలపై ఎక్కింది. దీంతో స్పాట్లోనే మృతి చెందాడు. మృతుడు నారపల్లికి చెందిన బాసిత్గా తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.