News February 26, 2025
వేంపాడులో లారీ ఢీకొని కాకినాడ జిల్లా వాసి మృతి

నక్కపల్లి మండలం వేంపాడు టోల్ ప్లాజా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందినట్లు ఎస్సై సన్నిబాబు మంగళవారం తెలిపారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలుకు చెందిన చిక్కాల శ్యాంప్రసాద్ (29) వేంపాడు వద్ద ఫ్యాబ్రిక్స్ వర్క్స్ షాపులో పని చేస్తున్నాడు. స్నేహితుడితో కలిసి బైక్పై టోల్ ప్లాజా వద్ద టీపాయింట్కు వెళుతుండగా లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో శ్యాం ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు.
Similar News
News January 15, 2026
కోకాకోలా $1B ఐపీఓ? క్లారిటీ ఇచ్చిన కంపెనీ

హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ (HCCB) IPOపై వస్తున్న వార్తలను ఆ కంపెనీ తోసిపుచ్చింది. ఈ వేసవిలో లేదా సమీప భవిష్యత్తులో అలాంటి ప్లాన్స్ ఏమీ లేవని సంస్థ ప్రతినిధి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తాము కేవలం మార్కెట్లో పట్టు సాధించడం, వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడంపైనే ఫోకస్ పెట్టామన్నారు. GST వల్ల లభించిన ధరల ప్రయోజనాలను కస్టమర్లకు బదిలీ చేస్తున్నామని తెలిపారు. IPO వార్తలన్నీ ఊహాగానాలేనన్నారు.
News January 15, 2026
సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లాలో ఆర్టీసీ ఆంక్షలు

ఆర్టీసీ, పోలీస్ ఆదేశానుసారం రేపు నిర్మల్లో సీఎం సభ ఉన్నందున ఉదయం 11 నుంచి సభ అయిపోయే వరకు భైంసావైపు నుంచి వచ్చిపోయే బస్సులు ఈద్ ఘా చౌరస్తా వరకు, ఖానాపూర్, మంచిర్యాలవైపు నుంచి వచ్చిపోయే బస్సులు కొండాపూర్ బైపాస్ వరకు, నిజామాబాద్, హైదరాబాద్వైపు నుంచి వచ్చిపోయే బస్సులు సోఫీ నగర్ వరకు, ఆదిలాబాద్వైపు నుంచి వచ్చి వెళ్లే బస్సులు బైల్ బజార్ వరకు నడుపుతామని ఆర్టీసీ డీఎం పండరి తెలిపారు.
News January 15, 2026
దేశ భద్రత విషయంలో ముందుంటాం: CM

TGలో మరో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని ఆర్మీ అధికారులను CM రేవంత్ కోరారు. పదేళ్లుగా ఒక్క స్కూలును కూడా మంజూరు చేయలేదన్నారు. సదరన్ కమాండ్ సెంటర్ ప్రధాన కార్యాలయాన్ని HYDకు మార్చే అంశాన్ని పరిశీలించాలని కోరారు. దేశ భద్రత అంశాల్లో సహకరించడంలో TG సర్కార్ ముందుంటుందని, లో ఫ్రీక్వెన్సీ నేవీ రాడార్ స్టేషన్కు VKDలో 3వేల ఎకరాలు కేటాయించినట్లు HYDలో జరిగిన సివిల్ మిలిటరీ లైజన్ కాన్ఫరెన్స్లో గుర్తుచేశారు.


