News February 26, 2025
SRPT: పంచాయతీ కార్యదర్శి సస్పెండ్

గరిడేపల్లి మండలం గానుగబండ పంచాయతీ కార్యదర్శి ఇంద్రబాబును కలెక్టర్ తేజస్ నందన్ లాల్ సస్పెండ్ చేశారు. ఇటీవలే హుజూర్నగర్లో నిర్వహించిన భగీరథ నీటి సమీక్ష సమావేశంలో గానుగబండలో భగీరథ నీటి సరఫరా విషయమై నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులు పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. కార్యదర్శి ఇచ్చిన వివరణలో పొంతనలేని సమాధానాలు ఉన్నాయని మంగళవారం అతణ్ని సస్పెండ్ చేశారు.
Similar News
News July 4, 2025
ASF: ‘మహనీయుల ఆశయ సాధనకు కృషి చేయాలి’

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, అమరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి, ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతిని ఆసీఫాబాద్ కలెక్టరేట్లో నిర్వహించారు. ఇక్కడ ఇరువురి చిత్రపటాలకు ASF కలెక్టర్ వెంకటేష్ ధౌత్రే, ఎమ్మెల్యే కోవాలక్ష్మి నివాళులర్పించారు. మహనీయుల సేవలను స్మరించుకుంటూ, వారి ఆశయ సాధనకు కృషి చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జేసీ డేవిడ్, జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులున్నారు.
News July 4, 2025
నిర్మల్: కలెక్టరేట్లో ఘనంగా దొడ్డి కొమురయ్య వర్ధంతి

వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్మల్ కలెక్టరేట్లో దొడ్డి కొమురయ్య వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. దొడ్డి కొమురయ్య చిత్రపటానికి అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, వివిధ శాఖల అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడైన దొడ్డి కొమురయ్య గురించి నేటి తరం వారికి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.
News July 4, 2025
బ్యాంకర్లకు విశాఖ కలెక్టర్ కీలక ఆదేశాలు

సామాన్యుల ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా బ్యాంకర్లు సహకారం అందించాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ బ్యాంకుల ప్రతినిధులతో కలెక్టరేట్ మీటింగు హాలులో శుక్రవారం సమావేశమయ్యారు. స్వయం సహాయ సంఘాల సభ్యులకు అందించే రుణాలను సకాలంలో రెన్యువల్ చేయాలని, వారి పొదుపు ఖాతాలోని 50శాతం సొమ్మును ఆటోమేటిక్గా ఎఫ్.డి. చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.