News February 26, 2025

వడ్డేపల్లి: నిప్పంటించుకుని ఓ వ్యక్తి సూసైడ్ ATTEMPT

image

నిప్పంటించుకుని వ్యక్తి ఆత్మహత్యకు యత్నించిన ఘటన వడ్డేపల్లి(M) శాంతినగర్‌లో జరిగింది. పోలీసుల వివరాలు.. అలంపూర్ మండలం క్యాతూర్‌కి చెందిన నర్సింహ ఓ ప్రైవేట్‌ ఫైనాన్స్‌లో రూ.4 లక్షలు తీసుకున్నాడు. ఈక్రమంలో 2 నెలలుగా వాయిదా కట్టకపోవడంతో సిబ్బంది ఇబ్బందులకు గురిచేశారు. దీంతో నర్సింహ ఫైనాన్స్ సిబ్బంది వద్దకు వెళ్లి వారి ముందు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. గమనించిన రైతులు ఆసుపత్రికి తరలించారు.

Similar News

News February 25, 2026

జీడీపీ దూకుడు: 8 శాతం దాటనున్న వృద్ధి!

image

అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధి ఏకంగా 8.1 శాతానికి చేరుతుందని ఎస్‌బీఐ నివేదిక అంచనా వేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం.. గ్రామాల్లో పంటల దిగుబడి బాగుండటం, నగరాల్లో జనం ఖర్చులు పెరగడమే దీనికి కారణం. ఫిబ్రవరి 27న వెలువడే ప్రభుత్వ అధికారిక లెక్కల్లో ఈ విషయం స్పష్టంగా తెలియనుంది.

News February 25, 2026

విమాన ప్రయాణం సేఫ్.. DGCA కొత్త రూల్స్!

image

విమాన ప్రమాదాలు పెరుగుతుండటంతో DGCA రూల్స్ మార్చేసింది. చార్టర్డ్ విమానాల ఓనర్లు వెబ్‌సైట్‌లో విమాన వయసు, పైలట్ ఎక్స్‌పీరియన్స్ వంటి వివరాలన్నీ పెట్టాలి. సేఫ్టీ విషయంలో పైలట్లనే కాకుండా పైఅధికారులనూ బాధ్యుల్ని చేస్తారు. రూల్స్ బ్రేక్ చేస్తే పైలట్ లైసెన్స్ ఐదేళ్ల వరకు కట్ అవుతుంది. వాతావరణం బాగోకపోతే విమానం ఆపేసే పవర్‌ పైలట్‌కు ఇచ్చారు. ఆపరేటర్లు రియల్ టైమ్ వెదర్ సిస్టమ్స్‌ను ఏర్పాటు చేసుకోవాలి.

News February 25, 2026

గుంతకల్లు డివిజన్‌లో ఖాళీల భర్తీకి కసరత్తు

image

సౌత్ సెంట్రల్ రైల్వే గుంతకల్లు డివిజన్‌లో పాయింట్స్ మెన్ ఖాళీల భర్తీ కోసం 16 మంది మాజీ సైనికులను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించనున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. రూ.18,000 వేతనం, ఇతర భత్యాలు చెల్లించనున్నారు. మాజీ సైనికులు మార్చి 6వ తేదీ లోపు దరఖాస్తులను గుంతకల్లు డివిజన్ కార్యాలయానికి సమర్పించాలన్నారు. మరిన్ని వివరాల కోసం 08554 241146 సంప్రదించవచ్చన్నారు.