News February 26, 2025

NLG: 600 మందితో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు

image

WGL- KMM – NLG ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ కు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 25న సాయంత్రం 4 గంటల నుంచి 27న పోలింగ్ ముగిసే వరకు సైలెంట్ పిరియడ్ అమల్లో ఉందని పేర్కొన్నారు. ఈ సమయంలో సభలు, సమావేశాలు నిర్వహించొద్దని తెలిపారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు టీఎస్ఎస్పీ సిబ్బందితో పాటు దాదాపు 600 మందితో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు.

Similar News

News July 9, 2025

NLG: స్థానిక ఎన్నికల నిర్వహణకు కసరత్తు

image

జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు వేగవంతమయ్యాయి. ఇప్పటికే గ్రామపంచాయతీల సరిహద్దులపై ప్రభుత్వానికి అధికారులు నివేదిక పంపించారు. గ్రామాల్లో వార్డులను కూడా ఖరారు చేశారు. తాజాగా మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (MPTCల) పునర్విభజన షెడ్యూల్‌ను ప్రకటించారు. నల్గొండ జిల్లాలో 352కు ఎంపీటీసీ స్థానాలు పెరిగాయి.

News July 8, 2025

ఎరువులను అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు: కలెక్టర్

image

ప్రభుత్వం నిర్దేశించిన ఎంఆర్‌పీ ధరలకు మించి ఎరువులు అమ్మినా, ఇతర ఎరువులతో లింకు పెట్టినా తీవ్ర చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. జిల్లాలో యూరియా సహా అన్ని ఎరువులు సరిపడా నిల్వలో ఉన్నాయన్నారు. రైతులు ఎలాంటి ఆందోళనకు లోనవ్వాల్సిన అవసరం లేదని, అవసరమైన దశల్లో వెంటనే అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఎవరైనా ఎంఆర్‌పికి మించి విక్రయిస్తే వారి మీద కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు.

News July 8, 2025

NLG: జీపీ వర్కర్లకు మూడు నెలల జీతాలు విడుదల

image

గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న మల్టీపర్పస్ వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఏప్రిల్, మే, జూన్ మాసాల వేతనాలుగా రూ.150 కోట్లు విడుదల చేసింది. ఒకటి రెండు రోజుల్లో జీతాలు వారి ఖాతాల్లోకి జమయ్యే అవకాశం ఉంది. నల్గొండ జిల్లాలోని 868 గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న 3,500 మందికి పైగా పారిశుద్ధ్య కార్మికులకు లబ్ధి చేకూరనుంది.