News February 26, 2025

వరంగల్: ఆ రూట్ బస్ ఛార్జీలపై సబ్సిడీ

image

ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి బెంగళూరుకు వెళ్లే ప్రయాణికులకు ఆర్టీసీ బస్సు ఛార్జీలపై సబ్సిడీ ప్రకటించింది. హనుమకొండ నుంచి బెంగళూరుకు వెళ్లే అన్ని ఏసీ, సూపర్ లగ్జరీ బస్ టికెట్లపై 10 శాతం ధరలు తగ్గించారు. దీంతో రాయితీ అనంతరం టికెట్ ధరలు ఇలా ఉన్నాయి. ఏసీ స్లీపర్ బెర్త్ టికెట్ రూ.1770, ఏసీ టికెట్ రూ.1380, సూపర్ లగ్జరీ రూ.1000గా ఉంటుంది.

Similar News

News February 26, 2025

విశాఖలో రేపు పాఠశాలలకు సెలవు

image

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో విశాఖలో అన్ని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు డీఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు. జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సూచనల మేరకు సెలవు ఇచ్చినట్లు పేర్కొన్నారు. అన్ని పాఠశాలల యాజమాన్యాలు విధిగా నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ మేరకు బుధవారం ఆదేశాలు జారీ చేశారు.

News February 26, 2025

తన రాతను తానే మార్చుకుని.. ఛాంపియన్‌గా!

image

పుట్టుకతోనే HIV సోకడంతో సమాజమంతా ఆమెను వెలివేసింది. బంధువులెవరూ దగ్గరకు రానివ్వని వేళ తన చేతిరాతను మార్చుకునేందుకు రన్నింగ్ ట్రాక్‌లోకి అడుగుపెట్టింది. ఆమె ఎవరో కాదు అథ్లెట్ సోనికా సంజు కుమార్. మాజీ అథ్లెట్ ఎల్విస్ జోసెఫ్ & బెంగుళూరు స్కూల్స్ స్పోర్ట్స్ ఫౌండేషన్ (BSSF) చొరవతో రన్నింగ్‌లో నైపుణ్యం పెంచుకుంది. అప్పటి నుంచి టోర్నమెంట్స్‌లో పాల్గొంటూ మెడల్స్ సాధించి ఔరా అనిపిస్తోంది.

News February 26, 2025

ఎమ్మెల్సీ ఓటు వేసేందుకు ప్రత్యేక సెలవు: జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

image

గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నమోదీత ఓటర్లుగా ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు ఓటు వినియోగించుకునేందుకు ప్రత్యేక సెలవు వర్తిస్తుందని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. వ్యాపార వాణిజ్య పారిశ్రామిక సంస్థ, ఇతర అన్ని ప్రైవేటు మేనేజ్మెంట్లు లలో పనిచేస్తు ఓటు హక్కు ఉన్న ఉద్యోగు ఓటు వేసేందుకు యాజమాన్యాలు అనుమతి ఇవ్వాలని తెలిపారు.

error: Content is protected !!