News February 26, 2025
చౌటుప్పల్: రూ.2వేలు ఇస్తే రూ.18,500 అంటూ మోసం!

రూ.2 వేలు ఫోన్పే చేస్తే 5 నిమిషాలలో రూ.18,500 ఇస్తామంటూ యువకులను మోసం చేసిన ఘటన చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలో జరిగింది. బాధితులు తెలిపిన వివరాలు.. ఆఫర్ ఇస్తున్నామంటూ ఓ ట్రస్ట్ పేరిట ఉమ్మడి కొయ్యలగూడెం వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ సందేశం పంపారు. రూ.2 వేలు కడితే రూ.18,500 ఇస్తామన్నారని బాధితులు వాపోయారు.
Similar News
News September 19, 2025
టుడే టాప్ స్టోరీస్

* జీఎస్టీ సంస్కరణలతో పేదల జీవితాలు మారతాయి: CM చంద్రబాబు
* ఢిల్లీకి సీఎం రేవంత్.. పెట్టుబడులపై కంపెనీల ప్రతినిధులతో రేపు భేటీ
* ప్రజల గొంతు వినాలని ప్రభుత్వానికి లేదు: జగన్
* నకిలీ ఓట్ల వెనుక ఎవరున్నారో తెలియాలి: రాహుల్ గాంధీ
* ఓట్ల చోరీ ఆరోపణలు చేయడం రాహుల్కు అలవాటుగా మారింది: BJP
* OCT 1 నుంచి అమల్లోకి ఆన్లైన్ గేమింగ్ చట్టం: కేంద్రం
* లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
News September 19, 2025
బగ్రామ్ ఎయిర్బేస్ స్వాధీనం చేసుకోవాలి: ట్రంప్

అఫ్గానిస్థాన్లోని బగ్రామ్ ఎయిర్బేస్ను తిరిగి స్వాధీనం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. గత ప్రెసిడెంట్ జోబైడెన్ ఎలాంటి ప్రయోజనం లేకుండానే ఆ స్థావరాన్ని వదిలేశారని విమర్శించారు. చైనా అణ్వాయుధ ఉత్పత్తి కేంద్రాల నుంచి కేవలం గంటలోనే ఈ ఎయిర్బేస్కు చేరుకోవచ్చని తెలిపారు. భవిష్యత్తులో చైనా ఈ స్థావరాన్ని చేజిక్కించుకుంటుందన్న అనుమానంతోనే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
News September 19, 2025
కరీంనగర్: చెత్త వేయకుండా ఇనుప జాలి ఏర్పాటు

కరీంనగర్లోని అంబేడ్కర్ స్టేడియం, బస్టాండ్ వెనుక రోడ్డులో ప్రజలు చెత్త వేయకుండా మున్సిపల్ అధికారులు ఇనుప జాలిని ఏర్పాటు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయవద్దని అధికారులు పదేపదే సూచించినా ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో ఈ చర్యలు తీసుకున్నారు. నగర పరిశుభ్రతను కాపాడటానికి అందరూ సహకరించాలని అధికారులు కోరారు.