News March 21, 2024
కేజ్రీవాల్ అరెస్ట్.. 2022లోనే చెప్పిన ఆస్ట్రాలజర్
సీఎం అరవింద్ కేజ్రీవాల్ విషయంలో ఆస్ట్రాలజర్ రుద్ర కరణ్ పర్తాప్ చెప్పిన జ్యోతిషం నిజమైంది. ‘మార్చి 2024 నుంచి కేజ్రీవాల్కు బ్యాడ్ టైమ్ మొదలవుతుంది. తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొంటారు. అరెస్ట్ అవుతారు. తర్వాత ఢిల్లీ సీఎం ఎవరో కూడా నాకు తెలుసు. తర్వాత చెబుతా. అతడి కర్మ ఫలం 2025 ఢిల్లీ ఎన్నికలలో ఓడిపోయేలా చేస్తుంది. తర్వాత నుంచి కేజ్రీవాల్ రాజకీయ పతనం మొదలవుతుంది’ అని 2022 మార్చి 25న ఆయన ట్వీట్ చేశారు.
Similar News
News October 2, 2024
చెత్తలో దొరికిన పెయింటింగ్.. విలువ రూ.46 కోట్లు!
62 ఏళ్ల క్రితం ఇటలీలోని ఓ ఇంటిని కొన్న వ్యక్తి చెత్తను శుభ్రం చేస్తుండగా ఓ పెయింటింగ్ దొరికింది. అదేదో పిచ్చి బొమ్మ అనుకుని పక్కన పెట్టేశారు. ఇన్ని దశాబ్దాల తర్వాత ఆ యజమాని కుమార్తె దాన్ని పికాసో కళాఖండంగా గుర్తించారు. అనంతరం దాని విలువ రూ.46 కోట్లని తెలిసి షాకయ్యారు. ప్రస్తుతం దాన్ని ఓ లాకర్లో భద్రపరిచామని, ఏం చేయాలన్నదానిపై పికాసో ఫౌండేషన్తో మాట్లాడుతున్నామని వారు తెలిపారు.
News October 2, 2024
కెప్టెన్సీకి బాబర్ ఆజమ్ రాజీనామా
పాకిస్థాన్ క్రికెట్ టీమ్ (టీ20, ODI) కెప్టెన్సీ నుంచి బాబర్ ఆజమ్ తప్పుకున్నారు. తన బ్యాటింగ్, పర్సనల్ గ్రోత్పై మరింత దృష్టి పెట్టేందుకే కెప్టెన్సీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. కెప్టెన్సీ వల్ల వర్క్ లోడ్ పెరిగిందని పేర్కొన్నారు. 2019లో టీ20, 2020లో ODI, టెస్ట్ కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్న బాబర్ 2023 ODI WC తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకున్నారు. మళ్లీ 2024 టీ20 WCకి ముందు కెప్టెన్ అయ్యారు.
News October 2, 2024
నితీశ్ కుమార్ ఫిట్గా లేరు: ప్రశాంత్ కిశోర్
బిహార్ సీఎం నితీశ్ శారీరకంగా, మానసికంగా ఫిట్గా లేరని పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించారు. కేంద్రంలో BJP తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి నితీశ్కు ఆసరా ఇస్తోందని దుయ్యబట్టారు. ప్రజా జీవితం నుంచి తరచుగా ఆయన గౌర్హాజరు, భూ సర్వే, వరదలు, స్మార్ట్ మీటర్ల బిగింపు వంటి కీలక విషయాలపై మౌనాన్ని ప్రాతిపదికగా చేసుకొని నితీశ్ ఆరోగ్యాన్ని అంచనా వేస్తున్నట్టు పేర్కొన్నారు.