News February 26, 2025
‘అమ్మానాన్న క్షమించండి.. యముడు పిలుస్తున్నాడు’

TG: సిరిసిల్లలో విషాదం చోటుచేసుకుంది. ధర్మారానికి చెందిన రాకేశ్(19) HYDలో చదువుకుంటున్నాడు. 3 రోజుల క్రితం తల్లిదండ్రులకు కాల్ చేసి తనకు చదువు అంటే ఇష్టం లేదని చెప్పాడు. ఇంటికి రమ్మనగా బయలుదేరాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ రాగా పోలీసులకు ఫిర్యాదు చేయగా కాచిగూడలో సూసైడ్ చేసుకున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ‘అమ్మానాన్న క్షమించండి.. యముడు పిలుస్తున్నాడు.. నేను వెళ్తున్నా.. బై.. బై..’ అని లేఖలో పేర్కొన్నాడు.
Similar News
News February 26, 2025
తేళ్లు, బొద్దింకలు కూడా తిన్నా: కామాక్షి భాస్కర్ల

తాను చైనాలో ఎంబీబీఎస్ చదువుకునే సమయంలో తేళ్లు, బొద్దింకలు కూడా తిన్నానని హీరోయిన్ కామాక్షి భాస్కర్ల తెలిపారు. తాను ఎక్కడికి వెళ్లినా అక్కడి వంటకాలు ట్రై చేస్తానని చెప్పారు. ‘చైనాలో ఒకప్పుడు గ్రీనరీ ఉండేది కాదు. తినడానికి కూరగాయలు కూడా దొరికేవి కాదు. అందుకే కనిపించిన జీవుల్ని చంపి తినడం వారికి అలవాటైంది’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు. ‘మా ఊరి పొలిమేర’ సిరీస్ చిత్రాలతో కామాక్షి ఫేమస్ అయిన విషయం తెలిసిందే.
News February 26, 2025
సిగ్గులేని జీడి గింజలా రేవంత్ వ్యవహారం: KTR

BRS ప్రభుత్వం పనులు ఆపేయడం వల్లే SLBC ప్రమాదం జరిగిందన్న CM వ్యాఖ్యలపై KTR మండిపడ్డారు. ‘సిగ్గులేదా జీడిగింజ అంటే నల్లగున్నా నాకేంటి సిగ్గు అన్నదట. అలా ఉంది రేవంత్ వ్యవహారం. బాధ్యత గల CM అయితే రెస్క్యూ ఆపరేషన్పై దృష్టి పెట్టేవాడివి. ఎన్నికలు, ఢిల్లీ టూర్లకు తిరిగే నీకు పాలన అంటే ఏంటో తెలుసా? SLBC డిజైన్ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని KCR ఎప్పుడో చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరిపించండి’ అని ట్వీట్ చేశారు.
News February 26, 2025
దేశ ప్రజలందరికీ కొత్త పెన్షన్ స్కీం

దేశ ప్రజల కోసం యూనివర్సల్ పెన్షన్ స్కీం తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 60 ఏళ్లు పైబడిన వారికి పెన్షన్ అందించేలా, నిర్మాణ కార్మికులు, గిగ్ వర్కర్లకు మేలు చేసే ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుత పెన్షన్ పథకాలనూ దీనిలో చేర్చే అవకాశం ఉంది. ఉద్యోగం చేస్తున్న, చేయని వారు, వ్యాపారం చేసే వారూ దీని ప్రయోజనాలు పొందేలా ప్లాన్ చేస్తోంది. త్వరలోనే దీని విధివిధానాలు ప్రకటించనున్నట్లు సమాచారం.