News February 26, 2025

MLC ఎన్నికకు 233 మంది పోలీస్ బందోబస్త్: ఎస్పీ

image

జిల్లాలో పట్టభద్రుల, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు గురువారం జరగనుండగా.. 233 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు ఎస్పీ అశోక్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో బందోబస్తు నిర్వహించే సిబ్బందికి సమావేశం నిర్వహించి సూచనలు ఇచ్చారు. జిల్లాలో 71 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ఇద్దరు డిఎస్పీలు, ఆరుగురు సీఐలతో స్ట్రైకింగ్ ఫోర్స్ సిబ్బంది పర్యటిస్తారన్నారు.

Similar News

News February 26, 2025

పాలకుర్తి: ఘనంగా శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం

image

పాలకుర్తి మండల కేంద్రంలోని స్వయంభూ శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహాస్వామి ఆలయంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ రోజు స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని అర్చకుల వేదమంత్రాల నడుమ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్, ఆలయ ఈవో మోహన్ బాబు, ప్రజాప్రతినిధులు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

News February 26, 2025

విశాఖ జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

➤ విశాఖ జిల్లా వ్యాప్తంగా మార్మోగిన శివనామస్మరణ
➤ రేపు 13 కేంద్రాలలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
➤ జిల్లా వ్యాప్తంగా రేపు అన్ని పాఠశాలలకు సెలవు
➤ త్వరలో విశాఖ మెట్రో పనులు ప్రారంభం?
➤ మల్కాపురానికి చెందిన 22 ఏళ్ల యువకుడు మృతి
➤ ఆర్.కే, అప్పికొండ, భీమిలి బీచ్‌లలో పుణ్యస్నానాలకు ఏర్పాట్లు చేసిన అధికారులు

News February 26, 2025

పోసాని అరెస్ట్ దుర్మార్గం: అంబటి

image

AP: సినీనటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ దుర్మార్గమని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. ఆయనకు ఆరోగ్యం బాగాలేదని చెబుతున్నా పోలీసులు దుందుడుకుగా ప్రవర్తించడం ఏంటని ప్రశ్నించారు. ‘అసలు పోసానిని ఏ కారణంతో అరెస్ట్ చేశారు. కూటమి సర్కార్ చట్టాలను తుంగలో తొక్కుతోంది. చంద్రబాబు, లోకేశ్‌ను ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? రాష్ట్రంలో లోకేశ్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది’ అని ఆయన ఫైర్ అయ్యారు.

error: Content is protected !!