News February 26, 2025

సజావుగా ఎన్నికలు నిర్వహించండి: జిల్లా కలెక్టర్

image

ఉపాధ్యాయ MLC ఎన్నికల పోలింగ్‌‌లో ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా సజావుగా నిర్వహించాలని కలెక్టర్ దినేశ్ కుమార్ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం తలారిసింగి ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన నాలుగు జోన్లు, రూట్ల అధికారులు, సిబ్బందితో మాట్లాడి, తగు సూచనలు జారీ చేశారు. ప్రిసైడింగ్ అధికారులకు పలు ప్రశ్నలు వేసి, సమాధానాలు రాబట్టి అనుమాన నివృత్తి చేశారు.

Similar News

News February 27, 2025

Vi, ఎయిర్‌టెల్ కస్టమర్లను ఆకర్షిస్తున్న BSNL ఆఫర్

image

లాంగ్‌టర్మ్ వ్యాలిడిటీతో BSNL అందిస్తున్న ఓ ఆఫర్ వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ కస్టమర్లను విపరీతంగా ఆకర్షిస్తోందని సమాచారం. 336 రోజుల వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్ కాల్స్, 24GB డేటా, రోజుకు 100 ఫ్రీ SMSలు, ఇతర ఫీచర్లను BSNL రూ.1499కే అందిస్తోంది. 24GB ముగిశాక 40kbps స్పీడుతో ఉచితంగా నెట్ పొందొచ్చు. ప్రస్తుతం వి, ఎయిర్‌టెల్ 365 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను రూ.1849కి అందిస్తుండటంతో కస్టమర్లు ఆలోచిస్తున్నారు.

News February 27, 2025

కామారెడ్డి జిల్లాలో నేటి TOP న్యూస్

image

* KMR జిల్లాలో శివనామస్మరణతో మార్మోగిన ఆలయాలు
* KMR: పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రి 
* నిబంధనల మేరకు ఎన్నికలు నిర్వహించాలి: KMR కలెక్టర్ 
* పిట్లం: రాజీ కాలేదని కన్నతల్లిని కొట్టి చంపేశాడు
* పిట్లం: స్వర్గానికి మార్గం.. రంజాన్ మాసం
* పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన బాన్సువాడ సబ్ కలెక్టర్ 
* బుగ్గ రామ లింగేశ్వర ఆలయాన్ని దర్శించుకున్న షబ్బీర్ అలీ 
* శివాలయాన్ని దర్శించుకున్న జుక్కల్ ఎమ్మెల్యే

News February 27, 2025

ఎన్నికలవేళ పోలింగ్ కేంద్రాల్లో పోలీస్ ఏర్పాట్లను పరిశీలించిన ఏసీపీ

image

రేపు జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మట్టవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇస్లామీయా ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాన్ని వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్ల భద్రత కోసం చేపట్టాల్సిన జాగ్రత్తలపై ఏసీపీ బందోబస్తు నిర్వహిస్తున్న సిబ్బందికి వివరించారు.

error: Content is protected !!